Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ నియంత్రణ మండలి జింబాబ్వే పర్యటనకు వెళ్లే 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన తర్వాత.. తాజాగా టీమ్ కోచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. జింబాబ్వే పర్యటనకు ప్రస్తుత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెళ్లడం లేదు. ఆయన స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అధిపతిగా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు వహించనున్నారు.
బిజీ షెడ్యూల్ వల్లే ఈ నిర్ణయం..
భారత జట్టు రాబోయే రోజుల్లో వరుస అంతర్జాతీయ సిరీస్లతో బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సిరీస్ ముగిసిన కొద్ది రోజులకే జూలై 23 నుంచి జింబాబ్వే పర్యటన ప్రారంభం కానుంది. గంభీర్కు విశ్రాంతినిస్తూ, పనిభారాన్ని తగ్గించేందుకు గానూ ఈ పర్యటన బాధ్యతలను లక్ష్మణ్కు అప్పగించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
- Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
- Mega DSC: 'మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ'.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
జింబాబ్వే పర్యటనతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 లో కూడా భారత జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తారు. అదే సమయంలో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు సిరీస్లు ఒకేసారి జరగడం వల్ల గంభీర్ సీనియర్ జట్టుతో కలిసి వెస్టిండీస్ సిరీస్లో ఉంటారు, లక్ష్మణ్ ఏషియన్ గేమ్స్ జట్టును నడిపిస్తారు.
VVS Laxman to Head Coach team India for the Zimbabwe tour and Asian Games. (Gaurav Gupta). pic.twitter.com/YfGkHh0Ngt
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2026
సపోర్ట్ స్టాఫ్లో మరికొంతమంది..
వీవీఎస్ లక్ష్మణ్తో పాటు సపోర్ట్ స్టాఫ్లో మరో ఇద్దరు మాజీ భారత ఆటగాళ్లకు చోటు లభించింది. మాజీ క్రికెటర్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్గా, మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ కోచింగ్ త్రయం జింబాబ్వే సిరీస్, ఏషియన్ గేమ్స్ తర్వాత బంగ్లాదేశ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లోనూ కొనసాగే అవకాశం ఉంది.
గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి పెద్ద టోర్నీలను గెలిచినప్పటికీ, ఇటీవల ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ చేతుల్లో ఎదురైన పరాజయాల నేపథ్యంలో రాబోయే సిరీస్లు భారత జట్టుకు ఎంతో కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
-
Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
-
Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
-
AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!