Jharkhand: నక్సలైట్ల ఏరియాలో ఓటింగ్.. ఇరువై ఏళ్ల తర్వాత ఓటు వేసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓట్లను బహిష్కరిస్తామనే నక్సలైట్ల బెదిరింపు నక్సలైట్ల ఆఖరి కంచుకోట అయిన సరంద మరియు కొల్హన్లోని దట్టమైన అడవుల్లో ఉన్న గ్రామాల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. నక్సల్ ప్రభావిత గ్రామాల్లో నిర్మించిన బూత్ల వద్ద ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 20 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తిరిల్పోసి, రెంగ్దహతు, బోరోయి గ్రామాల్లో ఓటింగ్ జరగలేదు. ఈ మూడు గ్రామాల్లో తొలిసారిగా ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచే ఈ కేంద్రాల వద్ద మహిళా, పురుష ఓటర్లు పోటెత్తారు. ఈ బూత్ల వద్ద గ్రామస్తులు తమ ఓటును పూర్తి ఉత్సాహంతో వేశారు.
దట్టమైన అడవిలో ఉన్న రెంగ్దహటు గ్రామంలో నాలుగు బూత్లు ఏర్పాటు చేశారు. వీటిలో రెంగదహతు, స్వయంభ, టెన్సారా, ముర్ముర పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు. ఓటర్ల భద్రత కోసం 174 బెటాలియన్ల సైనికులను ఇక్కడ మోహరించారు. సర్జాంబూరు, తుంబహాక, పాతతరోబ్ గ్రామాలకు చెందిన ఓటర్లు కూడా ఈ కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ఇక్కడ మొత్తం నాలుగు బూత్లతో కలిపి 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగగా, రెంగ్దహటు బూత్లో 68.51 శాతం, ముర్ముర బూత్లో 62 శాతం, టెన్సారా బూత్లో 62.3 శాతం, స్వయంభ బూత్లో 66.94 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్ ప్రభావిత బూత్లలో ఓటింగ్ శాతం దాదాపు 65 శాతానికి చేరుకుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
SBI BANK: చరిత్ర సృష్టించిన ఎస్బీఐ ఇండియా.. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్లో చేరిన తొలి బ్యాంక్..
ఓటింగ్ సరళిపై.. 174 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్నాథ్ జెనా మాట్లాడుతూ.. నిరంతర అవగాహన కార్యక్రమాలు, సిఆర్పిఎఫ్ క్యాంపు ఏర్పాటు కారణంగా ఇక్కడి ప్రజలు పూర్తి ఉత్సాహంతో నిర్భయ వాతావరణంలో ఓటు వేసినట్లు తెలిపారు. ఆరు, ఏడు కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన.. ద్విచక్రవాహనాలపై ప్రజలు ఈ బూత్లకు చేరుకుని ఓటు వేశారన్నారు. భద్రత దృష్ట్యా నాలుగు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో ఒకరోజు ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో మంగళవారం మళ్లీ చైబాసాకు పంపనున్నారన్నారు. అప్పటి వరకు ఈ పోలింగ్ కేంద్రం తమ రక్షణలో ఉంటుందరని తెలిపారు.
గోయిల్కెరా పోలీస్స్టేషన్ పరిధిలోని కుయిడా, ఛోటా కుయిడా, మరదిరి, మేరల్గడ, హతిబురు, తిలయాబెడ, బోయ్పైసాంగ్ సరిహద్దు ప్రాంతాలు, కటంబ, బయ్హతు, బోరై, లెంసడిహ్ గ్రామాలు, టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని హుసిపి, రాజబాస, తుంబహక, రెగడ, పట్టోరాబ్, గోబురు, లుయా గ్రామాలలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఈ గ్రామాలకు వెళ్లే దారిలో నక్సలైట్లు భారీ సంఖ్యలో ఐఈడీలను అమర్చారు. భద్రతా దళాలు 700 కంటే ఎక్కువ IEDలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ గ్రామాలకు రహదారులను సురక్షితంగా ఉంచారు. ఓటింగ్కు ఒకరోజు ముందు నక్సల్ ప్రభావిత బూత్లలోని సంబంధిత క్లస్టర్లకు ప్రత్యేక రైలు, ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా పోలింగ్ సిబ్బందిని పంపించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!