Vodafone Idea : ఆ విధంగా రూ.45,000 కోట్లను సమీకరించనున్న వొడాఫోన్ ఐడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వోడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు మంగళవారం ఈక్విటీ, ఈక్విటీ-లింక్డ్ సాధనాల ద్వారా రూ. 20,000 కోట్ల వరకు నిధులను సేకరించేందుకు ఆమోదించింది. ఇందులో కంపెనీ ప్రమోటర్లు కూడా పాల్గొంటారు. దీనితో పాటు ఈక్విటీ, రుణాల మిశ్రమం ద్వారా సుమారు రూ. 45,000 కోట్ల నిధులను సమీకరించే ప్రణాళికను రూపొందించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సంస్థ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇది సుమారు రూ. 2.1 లక్షల కోట్ల భారీ రుణాన్ని కలిగి ఉంది. వినియోగదారుల సంఖ్య నిరంతర క్షీణత మధ్య త్రైమాసిక నష్టాలను కూడా ఎదుర్కొంటోంది.
ఈక్విటీ/లేదా ఈక్విటీ-లింక్డ్ సాధనాల మిశ్రమం ద్వారా రూ. 20,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనను తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లు టెలికాం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం బ్యాంకర్లు, కన్సల్టెంట్లను నియమించేందుకు యాజమాన్యానికి అధికారం కూడా ఇచ్చారు. ఏప్రిల్ 2న జరిగే షేర్హోల్డర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనపై కంపెనీ ఆమోదం పొందనుంది. వచ్చే త్రైమాసికంలో ఈక్విటీ నిధుల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈక్విటీ పెంపు ప్రక్రియలో ప్రమోటర్లు కూడా పాల్గొంటారు.
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Read Also:Inter Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైన నో ఎంట్రీ..
ఈక్విటీ ఫండ్లను సేకరించిన తర్వాత, డెట్ ఫైనాన్సింగ్ కోసం తమ రుణదాతలతో చురుకుగా పని చేస్తామని కంపెనీ తెలిపింది. ఈక్విటీ, డెట్ల కలయిక ద్వారా దాదాపు రూ.45,000 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. వొడాఫోన్ ఐడియా తమ బ్యాంకు రుణం ప్రస్తుతం రూ.4,500 కోట్ల కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఈక్విటీ, డెట్ ఫండ్లను సేకరించిన తర్వాత కంపెనీ 4G కవరేజ్, 5G నెట్వర్క్ రోల్అవుట్, సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి పెట్టగలదు. ఇది కంపెనీ తన పోటీతత్వ స్థితిని మెరుగుపరచడానికి, మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రభుత్వ వాటా ఎంత?
పరిమిత పెట్టుబడితో కూడా పనితీరు నిరంతరం మెరుగుపడిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ప్రతిపాదిత నిధుల సమీకరణ, సానుకూల కార్యాచరణ వృద్ధితో, కంపెనీ మార్కెట్లో సమర్థవంతంగా పోటీపడుతుందని నమ్మకంగా ఉంది. గత ఏడాది చట్టబద్ధమైన బకాయిల ఆదాయంపై చెల్లించాల్సిన వడ్డీని వాటాగా మార్చిన తర్వాత, కంపెనీలో ప్రభుత్వ వాటా 33.1 శాతానికి పెరిగింది.
Read Also:OTT Viewers : ఓటీటీ ఎక్కువ వాడేదెవరో తెలిస్తే షాకవుతారు!
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!