Vodafone Idea : ఆ విధంగా రూ.45,000 కోట్లను సమీకరించనున్న వొడాఫోన్ ఐడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vodafone Idea : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వోడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు మంగళవారం ఈక్విటీ, ఈక్విటీ-లింక్డ్ సాధనాల ద్వారా రూ. 20,000 కోట్ల వరకు నిధులను సేకరించేందుకు ఆమోదించింది. ఇందులో కంపెనీ ప్రమోటర్లు కూడా పాల్గొంటారు. దీనితో పాటు ఈక్విటీ, రుణాల మిశ్రమం ద్వారా సుమారు రూ. 45,000 కోట్ల నిధులను సమీకరించే ప్రణాళికను రూపొందించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సంస్థ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇది సుమారు రూ. 2.1 లక్షల కోట్ల భారీ రుణాన్ని కలిగి ఉంది. వినియోగదారుల సంఖ్య నిరంతర క్షీణత మధ్య త్రైమాసిక నష్టాలను కూడా ఎదుర్కొంటోంది.
ఈక్విటీ/లేదా ఈక్విటీ-లింక్డ్ సాధనాల మిశ్రమం ద్వారా రూ. 20,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనను తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదించినట్లు టెలికాం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం బ్యాంకర్లు, కన్సల్టెంట్లను నియమించేందుకు యాజమాన్యానికి అధికారం కూడా ఇచ్చారు. ఏప్రిల్ 2న జరిగే షేర్హోల్డర్ల సమావేశంలో ఈ ప్రతిపాదనపై కంపెనీ ఆమోదం పొందనుంది. వచ్చే త్రైమాసికంలో ఈక్విటీ నిధుల సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈక్విటీ పెంపు ప్రక్రియలో ప్రమోటర్లు కూడా పాల్గొంటారు.
Also Read
- Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- Vaibhav Sooryavanshi: ‘నన్ను విపరీతంగా బాధ పెట్టారు’.. వైభవ్ సూర్యవంశీ ఆవేదన..
- Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
Read Also:Inter Exams: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం లేటైన నో ఎంట్రీ..
ఈక్విటీ ఫండ్లను సేకరించిన తర్వాత, డెట్ ఫైనాన్సింగ్ కోసం తమ రుణదాతలతో చురుకుగా పని చేస్తామని కంపెనీ తెలిపింది. ఈక్విటీ, డెట్ల కలయిక ద్వారా దాదాపు రూ.45,000 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. వొడాఫోన్ ఐడియా తమ బ్యాంకు రుణం ప్రస్తుతం రూ.4,500 కోట్ల కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఈక్విటీ, డెట్ ఫండ్లను సేకరించిన తర్వాత కంపెనీ 4G కవరేజ్, 5G నెట్వర్క్ రోల్అవుట్, సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి పెట్టగలదు. ఇది కంపెనీ తన పోటీతత్వ స్థితిని మెరుగుపరచడానికి, మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రభుత్వ వాటా ఎంత?
పరిమిత పెట్టుబడితో కూడా పనితీరు నిరంతరం మెరుగుపడిందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. ప్రతిపాదిత నిధుల సమీకరణ, సానుకూల కార్యాచరణ వృద్ధితో, కంపెనీ మార్కెట్లో సమర్థవంతంగా పోటీపడుతుందని నమ్మకంగా ఉంది. గత ఏడాది చట్టబద్ధమైన బకాయిల ఆదాయంపై చెల్లించాల్సిన వడ్డీని వాటాగా మార్చిన తర్వాత, కంపెనీలో ప్రభుత్వ వాటా 33.1 శాతానికి పెరిగింది.
Read Also:OTT Viewers : ఓటీటీ ఎక్కువ వాడేదెవరో తెలిస్తే షాకవుతారు!
తాజావార్తలు
-
Kieron Pollard: బాబోయ్.. పాకిస్థాన్ బౌలర్ను కొట్టడానికి వెళ్లిన పొలార్డ్.. ఆ బౌలర్ పరిస్థితి..
-
YS Jagan : రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
-
Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
-
Health Tips : దోమల సీజన్.. కుటుంబం తప్పక తెలుసుకోవాల్సిందిదే..!
-
Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!