Visakhapatnam: అసలే వివాహేతర బంధం.. అందులోనూ మళ్లీ పోటీ.. కత్తిపోట్లతో దద్దరిల్లిన విశాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: మహిళ.. ఇద్దరితో ఈ బంధాన్ని మెయింటేన్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో మహిళ ఓ వ్యక్తి.. మరో వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో జరిగింది. ఒక్కసారిగా కత్తిపోట్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. రైల్వే ఉద్యోగి మీద ఈ దాడి జరగడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలుత ఎవరో దోపిడీ దొంగలు డబ్బులు, బంగారం కోసం దాడి చేశారనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.
READ MORE: UGC: 54 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను డిఫాల్టర్లుగా ప్రకటించిన UGC.. లిస్ట్ ఇదిగో
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
విజయనగరానికి చెందిన గౌరినాయుడు, దొండపర్తికి చెందిన ఏనుగుల నాగరాజు ఇద్దరు రైల్వే ఉద్యోగులు. నిజానికి ఇద్దరు మంచి స్నేహితులే. కానీ వీరిద్దరి మధ్య ఓ మహిళ చిచ్చు పెట్టింది. అదే రైల్వే డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళతో గౌరీ నాయుడికి వివాహేతర సంబంధం ఉంది. అయితే అదే మహిళ.. నాగరాజుతోనూ వివాహేతర సంబంధం పెట్టుకుంది. తనతో రిలేషన్లో ఉంటూనే గౌరీ నాయుడితో సంబంధం పెట్టుకోవడం నాగరాజుకు నచ్చలేదు..
READ MORE: Lovers Suicide: ప్రేమ పెళ్లి.. కలిసి బతకలేక ప్రేమ జంట ఆత్మహత్య..
అయితే కొన్ని రోజుల నుంచి నాగరాజుకు అనుమానం ఉండేది. ఒక రోజు కన్ఫమ్ చేసుకోవడానికి ప్లాన్ వేశాడు. ఆ మహిళ ఇంటికి గౌరీ నాయుడు వెళ్లడం సీక్రెట్గా గమనించి ఫాలో అయ్యాడు. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని పట్టుకుని నిలదీశాడు. ఎందుకు ఇలా చేశావని మహిళను ప్రశ్నించాడు. ఇన్నాళ్లు తనతో రిలేషన్లో ఉండి ఇప్పుడు గౌరీ నాయుడుతో సంబంధం పెట్టుకోవడం ఏంటని ఆగ్రహంతో ఊగి పోయాడు నాగరాజు. ఆ ఇంట్లో వారి ముగ్గురికి వాగ్వాదం జరిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో నాగరాజు దాడికి దిగాడు. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు గౌరీ నాయుడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళకు కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు పాలైన గౌరీనాయుడు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. గౌరినాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే వివాదానికి దారితీసి దాడి జరిగినట్లు తెలిపారు.. మొత్తానికి ఇద్దరు వ్యక్తులతో ఏకకాలంలో వివాహేతర బంధం పెట్టుకున్న మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..