Virat Kohli: లండన్కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!
Virat Kohli: విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దుమ్ము రేపుతున్నాడు. మొదటి మ్యాచ్లో మంచి ఫామ్లో ఉన్నట్లు కనిపించాడు. సన్రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్లో తొలిసారిగా కైవసం చేసుకున్న టైటిల్ను కాపాడుకోవడంలో ఆర్సీబీకి విరాట్ అండగా ఉన్నాడు. అయితే, ఈ టోర్నీకి ముందు కోహ్లీ పెద్దగా ప్రాక్టీస్ సెషన్లలో కనిపించలేదు. జనవరిలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్లో ఎక్కువ సమయం గడిపాడు. భారత్లో తనపై ఉండే విపరీతమైన క్రేజ్, నిరంతర నిఘా నుంచి దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎక్కువగా లండన్లో ఉండటంపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. తాజాగా ఆర్సీబీ కంటెంట్ క్రియేటర్ ‘మిస్టర్ నాగ్స్’ (డానిష్ సేత్) తో జరిగిన సరదా సంభాషణలో ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. “కోహ్లీ లండన్లో ఉంటున్నారు కాబట్టి.. ఆర్సీబీ ఈసారి నలుగురు కాదు, ఐదుగురు ఓవర్సీస్ (విదేశీ) ప్లేయర్లతో ఆడుతోందని అందరూ జోకులు వేస్తున్నారు, దీనిపై మీరేమంటారు?” అని అడగ్గా.. కోహ్లీ నవ్వుతూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. “నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్లి ఆ విదేశీ ఆటగాళ్లనే అడుగు. నేనేం ఓవర్సీస్ ప్లేయర్ని కాదు కదా? నేనేమైనా విదేశీ ఆటగాడిలా కనిపిస్తున్నానా?” అంటూ సరదాగా కొట్టిపారేశారు.
READ MORE: Iran-Israel: ఇరాన్, లెబనాన్పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli).. భార్య, పిల్లలతో కలిసి త్వరలో లండన్లో స్థిరపడతాడని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. తన రిటైర్మెంట్ అనంతరం మిగిలిన జీవితాన్ని లండన్లోనే గడపాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ గతంలో వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్లో పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తోంది. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్ సైతం లండన్లోనే జన్మించడం గమనార్హం. కోహ్లీ కుటుంబం గతేడాది, ఈ ఏడాది సైతం ఎక్కువ కాలం లండన్లో గడిపింది. అక్కడ కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నాయట. ‘అవును.. విరాట్ తన పిల్లలు, భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను భారత్ను వదిలి అతి త్వరలో యూకేకు షిఫ్ట్ కాబోతున్నాడు. అయితే, ప్రస్తుతం కోహ్లీ క్రికెట్తో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు’ అని గతంలో రాజ్కుమార్ శర్మ తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
-
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?