తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న చిన్న గుంత ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రాణాలను కబళించింది. ప్రతిరోజూ లాగే సోమవారం ఉదయం 32 ఏళ్ల మహ్మద్ యూనస్ అనే వ్యక్తి ఆఫీసుకు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతలో బైక్ పడటంతో అదుపుతప్పి బస్సు కింద మరణించాడు. చెన్నైలోని సైదాపేటలోని చిన్నమలై ప్రాంతంలోని అన్నాసాలై రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.
బైకు రోడ్డుపై ఉన్న గుంతలో పడినప్పుడు ఎడమ వైపు వెళ్తున్న సిటీ బస్సు కిందకు బైక్ దూసుకెళ్లడంతో యూనస్ తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రమాద సమయంలో అతడు హెల్మెట్ ధరించినా మరణించాడు. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డు కాగా ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read Also: చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెనుప్రమాదం