Bangladesh Crisis : బంగ్లాదేశ్లో హింస ఆగాలి… కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గురువారం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా మహ్మద్ యూనస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నలకు.. బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడంలో.. దీర్ఘకాలిక శాంతి, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధమైన పాలన, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రతినిధి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్లాన్ చేస్తున్నందున తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్ సోదరి బబిత..
ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు బుధవారం, మహ్మద్ యూనస్ ప్రతి ఒక్కరూ శాంతిని కొనసాగించాలని.. అన్ని రకాల హింసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇటీవలి హింసను భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఖండించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలిక ప్రభుత్వం అంతం చేయాలని, దోషులను శిక్షించాలని అన్నారు. దేశవ్యాప్తంగా హింసను అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ అధికారులు, కొత్త అడ్మినిస్ట్రేషన్, పోలీసు చీఫ్, బంగ్లాదేశ్ ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
హిందూ మైనారిటీలే లక్ష్యం
ఈ హింసాకాండలో దేశంలోని హిందూ మైనారిటీలు, వారి ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలు దారుణంగా లక్ష్యంగా చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస, మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై తాను తీవ్ర ఆందోళనకు, విచారానికి గురయ్యానని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ అన్నారు.
Read Also:Technical Tips: మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!