Bangladesh Crisis : బంగ్లాదేశ్లో హింస ఆగాలి… కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గురువారం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా మహ్మద్ యూనస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నలకు.. బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడంలో.. దీర్ఘకాలిక శాంతి, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధమైన పాలన, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రతినిధి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్లాన్ చేస్తున్నందున తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్ సోదరి బబిత..
ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు బుధవారం, మహ్మద్ యూనస్ ప్రతి ఒక్కరూ శాంతిని కొనసాగించాలని.. అన్ని రకాల హింసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇటీవలి హింసను భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఖండించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలిక ప్రభుత్వం అంతం చేయాలని, దోషులను శిక్షించాలని అన్నారు. దేశవ్యాప్తంగా హింసను అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ అధికారులు, కొత్త అడ్మినిస్ట్రేషన్, పోలీసు చీఫ్, బంగ్లాదేశ్ ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
హిందూ మైనారిటీలే లక్ష్యం
ఈ హింసాకాండలో దేశంలోని హిందూ మైనారిటీలు, వారి ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలు దారుణంగా లక్ష్యంగా చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస, మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై తాను తీవ్ర ఆందోళనకు, విచారానికి గురయ్యానని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ అన్నారు.
Read Also:Technical Tips: మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!