Bangladesh Crisis : బంగ్లాదేశ్లో హింస ఆగాలి… కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గురువారం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా మహ్మద్ యూనస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నలకు.. బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడంలో.. దీర్ఘకాలిక శాంతి, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధమైన పాలన, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రతినిధి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్లాన్ చేస్తున్నందున తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్ సోదరి బబిత..
ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు బుధవారం, మహ్మద్ యూనస్ ప్రతి ఒక్కరూ శాంతిని కొనసాగించాలని.. అన్ని రకాల హింసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇటీవలి హింసను భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఖండించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలిక ప్రభుత్వం అంతం చేయాలని, దోషులను శిక్షించాలని అన్నారు. దేశవ్యాప్తంగా హింసను అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ అధికారులు, కొత్త అడ్మినిస్ట్రేషన్, పోలీసు చీఫ్, బంగ్లాదేశ్ ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
హిందూ మైనారిటీలే లక్ష్యం
ఈ హింసాకాండలో దేశంలోని హిందూ మైనారిటీలు, వారి ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలు దారుణంగా లక్ష్యంగా చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస, మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై తాను తీవ్ర ఆందోళనకు, విచారానికి గురయ్యానని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ అన్నారు.
Read Also:Technical Tips: మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!