Bangladesh Crisis : బంగ్లాదేశ్లో హింస ఆగాలి… కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గురువారం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా మహ్మద్ యూనస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నలకు.. బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడంలో.. దీర్ఘకాలిక శాంతి, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధమైన పాలన, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రతినిధి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్లాన్ చేస్తున్నందున తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్ సోదరి బబిత..
ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు బుధవారం, మహ్మద్ యూనస్ ప్రతి ఒక్కరూ శాంతిని కొనసాగించాలని.. అన్ని రకాల హింసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇటీవలి హింసను భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఖండించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలిక ప్రభుత్వం అంతం చేయాలని, దోషులను శిక్షించాలని అన్నారు. దేశవ్యాప్తంగా హింసను అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ అధికారులు, కొత్త అడ్మినిస్ట్రేషన్, పోలీసు చీఫ్, బంగ్లాదేశ్ ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
హిందూ మైనారిటీలే లక్ష్యం
ఈ హింసాకాండలో దేశంలోని హిందూ మైనారిటీలు, వారి ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలు దారుణంగా లక్ష్యంగా చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస, మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై తాను తీవ్ర ఆందోళనకు, విచారానికి గురయ్యానని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ అన్నారు.
Read Also:Technical Tips: మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!