Bangladesh Crisis : బంగ్లాదేశ్లో హింస ఆగాలి… కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా తెలిపింది. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ గురువారం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా మహ్మద్ యూనస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. బంగ్లాదేశ్లో వేగంగా మారుతున్న పరిణామాల గురించి అడిగిన ప్రశ్నలకు.. బంగ్లాదేశ్లో హింసను అంతం చేయడంలో.. దీర్ఘకాలిక శాంతి, రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడంలో తాత్కాలిక ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నామన్నారు.
తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టబద్ధమైన పాలన, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రతినిధి చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలకు ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్లాన్ చేస్తున్నందున తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
Also Read
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్పై కుట్ర జరిగిందా? స్పందించిన ఫోగట్ సోదరి బబిత..
ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు బుధవారం, మహ్మద్ యూనస్ ప్రతి ఒక్కరూ శాంతిని కొనసాగించాలని.. అన్ని రకాల హింసలను నివారించాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడంతో సహా ఇటీవలి హింసను భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఖండించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను తాత్కాలిక ప్రభుత్వం అంతం చేయాలని, దోషులను శిక్షించాలని అన్నారు. దేశవ్యాప్తంగా హింసను అంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ అధికారులు, కొత్త అడ్మినిస్ట్రేషన్, పోలీసు చీఫ్, బంగ్లాదేశ్ ప్రజలు అన్ని విధాలుగా ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
హిందూ మైనారిటీలే లక్ష్యం
ఈ హింసాకాండలో దేశంలోని హిందూ మైనారిటీలు, వారి ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలు దారుణంగా లక్ష్యంగా చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింస, మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలపై తాను తీవ్ర ఆందోళనకు, విచారానికి గురయ్యానని డెమోక్రటిక్ పార్టీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ అన్నారు.
Read Also:Technical Tips: మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ను అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?