Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: హైదరాబాద్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఉదయం నుంచి హైదరాబాద్లో పది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, విజయసాయిరెడ్డి ఇంటితో పాటు పలువురు అనుబంధ వ్యక్తుల ఇళ్లలో కూడా దర్యాప్తు కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో భారీ స్థాయిలో హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించినట్లు సమాచారం.
Read Also: Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
Also Read
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ఇక, చంద్రబాబు కావాలనే తనను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి, తనపై రాజకీయ కక్షతో ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంట్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదని, ఏమీ లభ్యం కాలేదని చెప్పారు. ఇంట్లో ఉన్న రూ.6 లక్షలు తమ తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం ఉంచినవేనని స్పష్టం చేశారు.
ఈడీ సోదాలు చేయాల్సింది అక్కడే..
ఈడీ అధికారులు తన ఇంట్లో కాకుండా చంద్రబాబు ఇంట్లో సోదాలు చేయాలని విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, జీవిత చరమాంకంలో అయినా మంచి పనులు చేయాలని సూచించారు. ప్రజలు అన్నింటినీ గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు.
జులైలో కొత్త పార్టీ ప్రకటిస్తా
రాజకీయాలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని, జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. అంతేకాదు.. రాజకీయాలతో పాటు మీడియా రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ప్రజలకు వెల్లడించేలా మీడియా వేదికను ఉపయోగిస్తానని చెప్పారు. అయితే, విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన, మీడియా రంగ ప్రవేశం, చంద్రబాబుపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జులైలో ఆయన ప్రకటించబోయే పార్టీ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు చేరతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!