Vijay Deverakonda: దేవరకొండ మార్కు కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో ఆన్లైన్ దాడులు, రేటింగ్ల రచ్చ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు సంక్రాంతి విడుదల సందర్భంగా బుక్ మై షోలో రేటింగ్లను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ కావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ దీనిపై తన మార్కు కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Anil Ravipudi: విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
Also Read
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
- Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
- Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
‘ఇది పరిశ్రమ కష్టానికి రక్షణ కవచమే అయినా, మనలోని విభేదాలు ఇలాంటి దాడులకు కారణమవుతున్నాయి’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సుదీర్ఘ పోస్ట్లో..’సినిమాలపై ఇలాంటి దాడులు పరిశ్రమ సహకార భావాన్ని దెబ్బతీస్తున్నాయి. 2019లో విడుదలైన తన ‘డియర్ కామ్రేడ్’ సినిమా నుంచే ఇలాంటి కోఆర్డినేటెడ్ బ్యాక్లాష్ను ఎదుర్కొన్నానని చెప్పారు. ‘ఆ సమయంలో మొదలైన ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు పెద్ద సినిమాలపై కూడా ఇది ప్రభావం చూపుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.
కోర్టు ఆదేశం అనేది సంక్రాంతి రిలీజ్లకు కొంత ఒత్తిడిని తగ్గిస్తుందని, అయితే ఇది సమస్యలను పూర్తిగా పరిష్కరించదని చెప్పారు. ‘లివ్ అండ్ లెట్ లివ్’ (బతకనివ్వు, బతకనిచ్చు) అనే సంస్కృతిని పరిశ్రమలో పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఆన్లైన్ సబోటేజ్ ఒక కొత్త సమస్య కాదు. గత కొన్నేళ్లుగా సినిమా విడుదల సమయంలో ఇలాంటి నెగెటివ్ రివ్యూలు, ఫేక్ రేటింగ్లు పెరిగిపోతున్నాయి. ఇవి సినిమా బాక్సాఫీస్ పనితీరును ప్రభావితం చేస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి దాడులను విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు ఎన్నో ఎదుర్కొన్నారు. ఇప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాలకు కూడా ఇది వ్యాపించడం పరిశ్రమకు హెచ్చరిక గంటలా మోగుతోందని చెబుతున్నారు.
కోర్టు ఆదేశం ఒకవైపు సినిమా నిర్మాతలకు ఊరటనిస్తూనే, మరోవైపు పరిశ్రమలోని అంతర్గత విభేదాలను బయటపెడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ‘మనమంతా ఒకే ఫ్యామిలీ’ అనే భావనను బలోపేతం చేయాల్సిన సమయమిది అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పోస్ట్ సినిమా ప్రేమికుల్లో చర్చ రేపుతోంది.
READ ALSO: Iran Protests: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ఇజ్రాయిల్ హైఅలర్ట్..
తాజావార్తలు
-
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
-
Hero Flex Fuel Bike: హీరో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ రిలీజ్ కు రెడీ.. పెట్రోల్, ఇథనాల్ రెండింటిపైనా పరుగులు!
-
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
-
Karnataka: కర్ణాటకపై రాహుల్గాంధీ వ్యూహం ఇదేనా? సిద్ధూకు లక్కీ ఛాన్స్!
-
Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!