విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘ఆదర్శకుటుంబం’ (House No: 47). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Dhurandhar 2 : నా బామ్మర్ది ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడు : ఆదిత్య ధర్
అయితే ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఒక చిన్న అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను దుబాయ్ నేపథ్యంలో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించింది. దీని కోసం విదేశీ షెడ్యూల్ను కూడా ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ఈ దుబాయ్ షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా లేదా ఇతర కారణాల వల్ల షూటింగ్ లొకేషన్ను మార్చాలా? లేక షెడ్యూల్ను వాయిదా వేయాలా? అనే కోణంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు టీమ్ ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా యంగ్ హీరో నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమిళ హాస్య నటుడు యోగి బాబు నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వెంకీ మార్క్ కామెడీ మరియు ఎమోషన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించడానికి సిద్ధమవుతోంది. విదేశీ షెడ్యూల్పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
