VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు!
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- “ప్రజా సంక్షేమ పోలీసింగ్” కాన్సెప్ట్ పరిచయం
- డ్రగ్స్, సైబర్ మోసాలపై ఉక్కుపాదం
- ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై దృష్టి
- మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.
VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పోలీసింగ్ సాధ్యమని, ప్రతి పౌరుడు పోలీసుగా భావించి నేరాల గురించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సజ్జనార్ పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ (ప్రజా సంక్షేమ పోలీసింగ్) అనే కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు ప్రజల సంక్షేమంపై కూడా దృష్టి పెడతామని ఆయన వివరించారు. దీనిలో భాగంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, అలాగే నకిలీ వస్తువులు, కల్తీ ఆహారం వంటి వాటిపై కూడా దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని తెలిపారు.
NEP vs WI: ఛీ.. ఛీ.. అసలు ఎలా గెలిచారో రెండు సార్లు ప్రపంచ కప్.. పసికూన చేతిలో వరుసగా రెండో పరాజయం
Also Read
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
అలాగే సజ్జనార్ కొన్ని కీలక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఇందులో డ్రగ్స్ సమస్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టిందని చెప్పారు. డ్రగ్స్కు బానిసలైన యువత, కుటుంబాలు నష్టపోకుండా డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, స్టాక్ అడ్వైజర్ మోసాలు పెరిగాయని, ముఖ్యంగా పెన్షనర్లు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కష్టపడితేనే డబ్బు వస్తుందని, సులభంగా డబ్బు సంపాదించే పద్ధతులను నమ్మవద్దని కోరారు.
Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్ల ముందు దేశమే కనిపించింది!
మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను, ఇతర ఆన్లైన్ మోసపూరిత యాప్లను ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఎంతోమంది కుటుంబాలు నష్టపోయాయని గుర్తు చేశారు. ఇక నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, రోడ్డుపై ప్రజల సమయం తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవింగ్పై కఠినంగా వ్యవహరిస్తామని, తాగిన మత్తులో డ్రైవింగ్ చేయడం ఒక రకంగా ‘రోడ్ టెర్రరిజం’ వంటిదని అభివర్ణించారు. అలాగే ముఖ్యంగా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక నగరంలో నేరాలను తగ్గించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!