దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్నచిత్రం ‘వారణాసి’. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి మరియు మహేశ్ బాబు ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. అయితే ‘వారణాసి’ సినిమాకు ఆయన తన పారితోషికం కింద మొత్తం ఓవర్సీస్హ క్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న గ్లోబల్ మార్కెట్ క్రేజ్ దృష్ట్యా, ఈ ఓవర్సీస్ రైట్స్ విలువ సుమారు 160 కోట్ల రూపాయల పైమాటే అని అంచనా. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక దర్శకుడు ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..
అటు మహేశ్ కూడా కేవలం నటుడిగానే కాకుండా ఈ సినిమాలో మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామి అని సమాచారం. ఈ చిత్ర నిర్మాణం కోసం ఆయన లాభాల్లో వాటాను దక్కించుకోబోతున్నారట. తాజా అంచనాల ప్రకారం, ఈ సినిమా ద్వారా మహేశ్ బాబుకు దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వర్క్ అవుట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ లో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.