Varalaxmi Sarathkumar: నటిగా మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ తొలిసారి మెగాఫోన్ పట్టిన చిత్రం ‘S. సరస్వతి’. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన రోజే ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియా వేదికగా ఓ సినిమా కథపై పరోక్షంగా సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. తన కథను పూర్తిగా మార్చేశారని, అసలు కథను ‘రేప్’ చేశారంటూ సాయి మాధవ్ బుర్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక రచయితగా తన భావోద్వేగానికి భిన్నంగా సినిమా తీశారన్నది ఆయన వాదన. ఈ కామెంట్స్ S. సరస్వతి సినిమాపైనే చేశారని అందరూ చర్చించుకుంటున్నారు.
READ ALSO: Wife kills Husband: భర్త మరణించిన నెలలోపే మరో పెళ్లి.. అప్పుడే అసలు నిజం తెలిసింది..
అయితే తాజాగా ఈ కామెంట్స్పై వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు సాయి మాధవ్ బుర్రాపై గౌరవం ఉందని చెప్పారు. తాను ఈ కథను దొంగిలించలేదని, సరైన పద్ధతిలోనే డబ్బు చెల్లించి కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. ఒకసారి హక్కులు కొన్న తర్వాత ఆ కథ తన సొంతమని, ఆరేళ్లుగా ఆయన దగ్గరే ఉన్న బేసిక్ ప్లాట్ను నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్చినట్లు తెలిపారు. సినిమాలో కథా రచయితగా ఆయనకు పూర్తి గౌరవం ఇచ్చానని గుర్తు చేశారు. సాయి మాధవ్ బుర్రా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఒక్కసారి కూడా కథా చర్చల్లో పాల్గొనలేదని వెల్లడించారు. ముఖ్యంగా మహిళా ఇతివృత్తంతో సాగే సినిమా విషయంలో ‘రేప్’ వంటి పదాలను వాడటం ఒక సీనియర్ రైటర్కు తగదని, “మహిళల పట్ల జరిగే అన్యాయంపై సినిమా తీస్తుంటే.. అదే సినిమా కథను రేప్ చేశారని అనడం నన్ను తీవ్రంగా బాధించింది” అని పేర్కొన్నారు.
READ ALSO: IND vs NZ Final: గంభీర్ కాస్త జాగ్రత్త! అహ్మదాబాద్ పిచ్పై టీమిండియాను ముంచే ‘ముల్లు’ ఇతనే!