Viral Video: వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఫుడ్ ఇచ్చిన వెయిటర్‌.. చివరకు.?

  • వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన
  • వెజ్‌కి బదులు నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఇవ్వడంతో..
  • వెయిటర్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రయాణికుడు
  • హౌరా-రాంచీ మధ్య ఘటన
Wayanad Landslides

Wayanad Landslides

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వెజ్‌కి బదులు నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఇవ్వడంతో ఓ ప్రయాణికుడు వెయిటర్‌పై చిరుబుర్రులాడాడు. అంతేకాకుండా.. కోపంతో వెయిటర్‌ని ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టాడు. నిజానికి వెయిటర్ చేసిన తప్పు ఏంటంటే.. అతను వెజ్‌కి బదులుగా ప్యాసింజర్‌కి నాన్‌వెజ్‌ ఫుడ్‌ ఇచ్చాడు. దీంతో.. వెయిటర్‌పై ఆగ్రహించిన ప్రయాణికుడు రైలులోనే బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన హౌరా-రాంచీ మధ్య చోటుచేసుకుంది. ప్రయాణంలో.. వెయిటర్ ఆహారంతో ప్రయాణికుడి వద్దకు వచ్చాడు. అయితే.. ప్రయాణీకుడు కంపార్ట్‌మెంట్‌పై ఇచ్చిన సూచనలను చదవకుండా తినడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను వెయిటర్‌ను పిలిచి రైలులో గొడవకు దిగాడు.

Rashid Khan: రషీద్ ఖాన్ @600 వికెట్లు..

రైలులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో క్యాప్షన్‌లో.. “ఈ వ్యక్తి శాఖాహారుడు.. అతనికి నాన్ వెజ్ అందించబడింది. ఇది అతనికి కోపం తెప్పించింది. దీంతో.. వెయిటర్‌ను చెంపదెబ్బ కొట్టాడు” అని రాశాడు. ఈ వీడియోలో ప్రయాణికుడు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా.. వెయిటర్‌ని క్షమాపణ చెప్పమని పదే పదే అడిగాడు.

Chennai Drug seized: చెన్నైలో రూ.70 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు అరెస్ట్

అయితే.. వెయిటర్ ఈ పొరపాటుకు ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పాడు. రైలులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా వెయిటర్ను క్షమాపణ చెప్పాలని కోరారు. మరోవైపు.. ఓ ప్రయాణికుడు ప్యాకెట్‌లో ఆహారం శాఖాహారమా కాదా అని రాసి ఉందని అతనికి చెప్పాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెయిటర్ నీకంటే పేదవాడు, నీతో పోరాడలేడని, కాబట్టి అతనిపై మీ కోపాన్ని వెళ్లగక్కుతారా అని కామెంట్స్ చేస్తున్నారు.