US Navy Plane Crash: చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Navy Plane Crash: ప్రపంచం దృష్టి ఒక్కసారిగా చైనా వైపు మళ్లింది. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు US నేవీ విమానాలు కూలిపోయాయి. రెండు ప్రమాదాలు వేర్వేరు సమయంలో జరిగాయి. మొదటి సంఘటనలో MH-60R సీహాక్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 2:45 గంటలకు కూలిపోయింది. USS నిమిట్జ్ విమాన వాహక నౌక నుంచి హెలికాప్టర్ సాధారణ వ్యాయామాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన దాదాపు 30 నిమిషాల తర్వాత, మధ్యాహ్నం 3:15 గంటలకు అదే నౌక నుంచి F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ కూడా కూలిపోయింది.
READ ALSO: Viral Video: ఛీ.. ఛీ.. అయ్యప్ప మాల వేసుకొని ఈ గలీజు పనేంటి స్వామి..!
Also Read
సురక్షితంగా సిబ్బంది..
MH-60R సీహాక్ హెలికాప్టర్ బాటిల్ క్యాట్స్ అని పిలిచే మారిటైమ్ స్ట్రైక్ స్క్వాడ్రన్ 73 కి చెందినది. ప్రమాద సమయంలో ఈ హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం అనంతరం వారిని సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. సూపర్ హార్నెట్ విమానం ఫైటింగ్ రెడ్హాక్స్ అని పిలిచే స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ 22 కి చెందినది. ఇందులో ఉన్న ఇద్దరు పైలట్లు ఎజెక్షన్ సీట్లను ఉపయోగించి బయటపడ్డారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ 11 నుంచి వచ్చిన రెస్క్యూ బృందం వారిని సురక్షితంగా రక్షించింది.
ప్రమాదంపై చైనా స్పందన ఏంటంటే..
సైనిక వ్యాయామం సందర్భంగా ఈ ప్రమాదాలు జరిగాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదాల తర్వాత అమెరికాకు మానవతా సహాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు. అయితే ఒకే నౌకలో ఇంత తక్కువ సమయంలో ఈ రెండు ప్రమాదాలు ఎలా జరిగాయనే దానిపై అమెరికా నావికాదళం దర్యాప్తు ప్రారంభించింది. ఆ సమయంలో రెండు విమానాలు ఏ మిషన్ లేదా ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నాయో అమెరికన్ నేవీ వెల్లడించలేదు. అరగంటలోపు ఒకే నౌక నుంచి రెండు విమానాలు కూలిపోయిన సంఘటనను సైనిక నిపుణులు అనుమానాస్పదంగా పరిగణిస్తున్నారు.
దక్షిణ చైనా సముద్రం భౌగోళిక రాజకీయ దృక్కోణం నుంచి సున్నితమైన ప్రాంతం. చైనా మొత్తం సముద్ర ప్రాంతాన్ని ఇది క్లెయిమ్ చేస్తుందని డ్రాగన్ వాదన. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే బీజింగ్ వాదనను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అయినప్పటికీ చైనా ఇటీవల సంవత్సరాలలో ఇక్కడ సైనిక స్థావరాలు, కృత్రిమ దీవులను నిర్మించింది. ఈ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛను కాపాడుకోవడానికి అమెరికా ఓడలు, విమానాలను మోహరిస్తుంది. యుఎస్ఎస్ నిమిట్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతనమైన యుఎస్ విమాన వాహక నౌకలలో ఒకటి. ఇది 2026 లో సేవల నుంచి వైదొలగనుంది. ఈ ఓడ నుంచి బయలుదేరిన హెలికాప్టర్, విమానం రెండు 30 నిమిషాల వ్యవధిలో ప్రమాదానికి గురయ్యాయి.
READ ALSO: Shreyas Iyer Health Update: ఐసీయూ నుంచి బయటికి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!
తాజావార్తలు
-
Bengal’s Next CM: బెంగాల్లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
-
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!