ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై యూఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తుంది. ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్ మానవరహిత వైమానిక వాహనాలను అందజేశారని అమెరికా తెలిపింది. గురువారం నాడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో 12కు పైగా కంపెనీలపై నిషేదం విధించగా వాటిలో భారత్ కు చెందిన 3 కంపెనీలు ఉన్నాయి.
Read Also: Rathnam Twitter Review : ఆ మాస్ కాంబో హాట్రిక్ కొట్టినట్లేనా..?
ఇక, రష్యాకు అక్రమంగా ఆయుధాలను చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం ‘సహారా థండర్’ కీలక పాత్ర పోషించినట్లు అమెరికా వెల్లడించింది. కాగా, హిజ్బుల్లా, హమాస్, పాలస్థీనా ఇస్లామిక్ జిహాద్ లాంటి ఉగ్రవాద గ్రూపులకు సపోర్టు ఇస్తున్నందుకు ఇరాన్పై యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి రహస్య విక్రయాలను ఈజీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించడంలో ఈ కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అగ్రరాజ్య ట్రెజరీ విభాగం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
Read Also: Warangal Mgm Hospital: మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్లిపోతున్న మృతదేహాలు
కాగా, ఉక్రెయిన్లో తమ యుద్ధ అవసరాల కోసం ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాల నుంచి రష్యా ఆయుధాలను సమకూర్చుకుంటుందని యూఎస్ ఆరోపించింది. ఇక, భారత్కు చెందిన కంపెనీల్లో జెన్ షిప్పింగ్, పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీఆర్ట్ షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. కాగా, ఇరాన్కు చెందిన సహారా థండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలకు చెందిన ఆయుధాలను చైనా, రష్యా, వెనిజులా సహా పలు ఇతర దేశాలకు అమ్మకాలు జరిపేందుకు భారీ షిప్పింగ్ నెట్వర్క్పై ఆధారపడిందనే విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది.
