స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తమ కొత్త ఫోన్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేక పుట్టించే ఫీచర్లతో మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. వచ్చే వారం భారతీయ మార్కెట్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లు విడుదల కానున్నాయి. ఒప్పో, వివో, రియల్మీ కంపెనీలు తమ ఫోన్లను విడుదల చేయనున్నాయి. మంచి కెమెరా, బిగ్ బ్యాటరీ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో రానున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read:IPL 2025 : సగం ఐపీఎల్ అయిపోయింది భయ్య.. రికార్డులు చూద్దాం రండి..
ఒప్పో K13 5G
Oppo ఈ కొత్త ఫోన్ రేపు అంటే ఏప్రిల్ 21, 2025న లాంచ్ కానుంది. ఈ ఫోన్ లో 6.67-అంగుళాల AMOLED డిస్ల్పే, ఫుల్ HD+, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ కూడా ఫోన్లో అమర్చారు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. 7000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 తో రావచ్చు. దీని ధర దాదాపు రూ. 20,000 ఉండవచ్చు.
Also Read:Matter Era: ప్రపంచంలోనే గేర్లతో వచ్చేసిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ తో 172KM రేంజ్!
వివో T4 5G
ఈ ఫోన్ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. దీని లాంచ్ తేదీ ఏప్రిల్ 22, 2025. Vivo T4 5Gలో 6.77-అంగుళాల పూర్తి HD AMOLED డిస్ప్లేను చూడవచ్చు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 5000 nits బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ని కలిగి ఉంది. దీనిని Adreno 720 గ్రాఫిక్స్ ప్రాసెసర్తో అందించవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్టచ్ OS 15 పనిచేస్తుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, 7,300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో T4 ధర కూడా దాదాపు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఉండవచ్చు.
Also Read:Nitesh Rane: ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ పర్మిషన్ తీసుకున్నాడా..? రాజ్ వ్యవహారంపై బీజేపీ నేత..
రియల్మీ 14T 5G
రియల్మీ తన కొత్త ఫోన్ను ఏప్రిల్ 24 న లాంచ్ చేయబోతోంది. ఇది 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. MediaTek 6300 ప్రాసెసర్ను అమర్చే ఛాన్స్ ఉంది. 8GB RAM, 256GB స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.