WPL 2025: WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. ఉత్కంఠపోరులో UP వారియర్స్ విజయం
- మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో తొలి సూపర్ ఓవర్
- ఉత్కంఠపోరులో UP వారియర్స్ విజయం
- సూపర్ ఓవర్ లో ఆర్సిబిపై గెలిచిన UP వారియర్స్ (UPW).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025లో సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), UP వారియర్స్ (UPW) మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్, ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. ఈ మ్యాచ్ తో WPL చరిత్రలో తొలిసారిగా సూపర్ ఓవర్ జరిగింది. చివరికి సూపర్ ఓవర్ లో దీప్తి శర్మ నేతృత్వంలోని UP వారియర్స్ విజయం సాధించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సిబి జట్టు మొదట 180/6 స్కోరు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో యూపీ 10 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ టై అయింది.
Read Also: Chhaava : ఛావా 11 రోజుల కలెక్షన్స్.. పుష్ప -2 రికార్డ్ జస్ట్ మిస్
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ క్రికెటర్ సోఫీ కీలక పాత్ర పోషించింది. బ్యాట్తో మెరిసిన ఆమె ఆ తర్వాత సూపర్ ఓవర్లో బౌలింగ్ చేస్తూ 8 పరుగులు కూడా డిఫెండ్ చేసింది. సూపర్ ఓవర్లో ఆర్సిబి కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UP వారియర్స్ 11వ ఓవర్లో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇందులో శ్వేతా సెహ్రావత్ 31 పరుగులు, దీప్తి 25 పరుగులు అందించారు. ఆ తర్వాత 17వ ఓవర్లో యూపీ స్కోరు 139/8 చేరుకోగా.. చివరి 18 బంతుల్లో యుపికి 42 పరుగులు అవసరం అయ్యింది. ఆ తర్వాత సోఫీ18వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో జట్టు స్కోరును 150 దాటించింది.
ఆ తర్వాత 19వ ఓవర్లో యుపికి 11 పరుగులు రాగా.. చివరి ఓవర్లో యుపికి 18 పరుగులు అవసరం కాగా 17 పరుగులు మాత్రమే సాధించింది. రేణుకా ఠాకూర్ సింగ్ వేసిన 20వ ఓవర్ నాల్గవ బంతికి సోఫీ మొదటి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. క్రాంతి గౌడ్ ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగుకు ప్రయత్నిస్తూ సోఫీ రనౌట్ అయ్యింది. సోఫీ 19 బంతుల్లో 33 పరుగులు సాధించింది. అంతకుముందు, ఎల్లీస్ పెర్రీ 90 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో ఆర్సిబి భారీ స్కోరు చేసింది. పెర్రీ 56 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాత డానీ వ్యాట్ హాడ్జ్ 57 పరుగులతో కలిసి రెండో వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తప్ప, మరే ఇతర RCB ఆటగాడూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.
Read Also: YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్.. ఏకంగా 20 మంది కార్పొరేటర్లు జనసేన వైపు..
ఇదిలా ఉండగా, సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ 8 పరుగులు సాధించి ఒక వికెట్ కోల్పోయింది. తక్కువ పరుగుల లక్షానికి వచ్చిన ఆర్సిబి సోఫీ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులకే పరిమితం కావడంతో UP వారియర్స్ విజయం అందుకుంది.
🎥 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨
What winning the first #TATAWPL Super Over feels like 🥳
Describe the match in one word! 👇✍️ #RCBvUPW | @UPWarriorz pic.twitter.com/IGtffiItNh
— Women's Premier League (WPL) (@wplt20) February 25, 2025
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!