WPL 2025: WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. ఉత్కంఠపోరులో UP వారియర్స్ విజయం
- మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో తొలి సూపర్ ఓవర్
- ఉత్కంఠపోరులో UP వారియర్స్ విజయం
- సూపర్ ఓవర్ లో ఆర్సిబిపై గెలిచిన UP వారియర్స్ (UPW).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WPL 2025: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025లో సోమవారం నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), UP వారియర్స్ (UPW) మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్, ఫలితం సూపర్ ఓవర్లో వచ్చింది. ఈ మ్యాచ్ తో WPL చరిత్రలో తొలిసారిగా సూపర్ ఓవర్ జరిగింది. చివరికి సూపర్ ఓవర్ లో దీప్తి శర్మ నేతృత్వంలోని UP వారియర్స్ విజయం సాధించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సిబి జట్టు మొదట 180/6 స్కోరు చేసింది. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో యూపీ 10 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. దీనితో మ్యాచ్ టై అయింది.
Read Also: Chhaava : ఛావా 11 రోజుల కలెక్షన్స్.. పుష్ప -2 రికార్డ్ జస్ట్ మిస్
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ క్రికెటర్ సోఫీ కీలక పాత్ర పోషించింది. బ్యాట్తో మెరిసిన ఆమె ఆ తర్వాత సూపర్ ఓవర్లో బౌలింగ్ చేస్తూ 8 పరుగులు కూడా డిఫెండ్ చేసింది. సూపర్ ఓవర్లో ఆర్సిబి కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో UP వారియర్స్ 11వ ఓవర్లో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇందులో శ్వేతా సెహ్రావత్ 31 పరుగులు, దీప్తి 25 పరుగులు అందించారు. ఆ తర్వాత 17వ ఓవర్లో యూపీ స్కోరు 139/8 చేరుకోగా.. చివరి 18 బంతుల్లో యుపికి 42 పరుగులు అవసరం అయ్యింది. ఆ తర్వాత సోఫీ18వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో జట్టు స్కోరును 150 దాటించింది.
ఆ తర్వాత 19వ ఓవర్లో యుపికి 11 పరుగులు రాగా.. చివరి ఓవర్లో యుపికి 18 పరుగులు అవసరం కాగా 17 పరుగులు మాత్రమే సాధించింది. రేణుకా ఠాకూర్ సింగ్ వేసిన 20వ ఓవర్ నాల్గవ బంతికి సోఫీ మొదటి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. క్రాంతి గౌడ్ ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగుకు ప్రయత్నిస్తూ సోఫీ రనౌట్ అయ్యింది. సోఫీ 19 బంతుల్లో 33 పరుగులు సాధించింది. అంతకుముందు, ఎల్లీస్ పెర్రీ 90 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో ఆర్సిబి భారీ స్కోరు చేసింది. పెర్రీ 56 బంతులలో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాత డానీ వ్యాట్ హాడ్జ్ 57 పరుగులతో కలిసి రెండో వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తప్ప, మరే ఇతర RCB ఆటగాడూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.
Read Also: YSRCP vs Janasena: ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్.. ఏకంగా 20 మంది కార్పొరేటర్లు జనసేన వైపు..
ఇదిలా ఉండగా, సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ 8 పరుగులు సాధించి ఒక వికెట్ కోల్పోయింది. తక్కువ పరుగుల లక్షానికి వచ్చిన ఆర్సిబి సోఫీ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులకే పరిమితం కావడంతో UP వారియర్స్ విజయం అందుకుంది.
🎥 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨
What winning the first #TATAWPL Super Over feels like 🥳
Describe the match in one word! 👇✍️ #RCBvUPW | @UPWarriorz pic.twitter.com/IGtffiItNh
— Women's Premier League (WPL) (@wplt20) February 25, 2025
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?