NTV Telugu Site icon

UP Police: ఉత్తరప్రదేశ్ ఘటన.. తుపాకీతో పారిపోబోయిన నిందితులు.. కాళ్లపై కాల్చిన పోలీసులు

Up Police

Up Police

UP Police: ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుపట్టా లాగిన ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నిందితులు తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిందితుడి కాలి పై కాల్చి అరెస్ట్ చేశారు. దుపట్టా లాగడంతో బాలిక రోడ్డుపై పడిపోయింది. వాహనం ఆమెపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిపై చర్యలు తీసుకుంటున్నారు.

Read Also:Asaduddin Owaisi: “థర్డ్ ఫ్రంట్” ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ని కోరా..

నిందితులు షాబాజ్, ఫైజల్‌లను పోలీసులు వారి కాళ్లపై కాల్చి అరెస్ట్ చేశారు. పారిపోతుండగా మూడో నిందితుడి కాలు విరిగింది. విద్యార్థినిపై కొందరు యువకులు వేధింపులకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక దుపట్టా లాగడంతో సైకిల్‌పై నుంచి కిందపడి కారు ఢీకొని మృతి చెందింది. బాలిక మృతితో ఆమె కుటుంబంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

Read Also:Motorola Edge 40 Neo: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..!

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆమె చదువులో బాగా రాణించి డాక్టర్‌ కావాలనుకుంటోందని తెలిపారు. వేధింపులపై పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తండ్రి వాపోయారు. పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు తన కూతురు బతికే ఉండేదని అతని ఫిర్యాదు. షాబాజ్, ఫైసల్, మరో బాలుడు కలిసి ఆమెను వెంబడిస్తున్నారని మృతురాలి స్నేహితుడు తెలిపాడు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాడు. ఆ రోజు ఈ వ్యక్తులు బాలిక దుపట్టాను లాగి, ఫైసల్ ఆమెపై నుంచి బైక్‌ను నడిపారు. ఆమె శరీరం నుంచి తీవ్ర రక్త స్రావమై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించింది.