Man Kills PhD Student: విద్యార్థిని హత్య చేసి.. మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills PhD Student: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకు ఉండే పీహెచ్డీ విద్యార్థిని దారుణం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. ఈ దారుణ ఘటన రెండు నెలల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలలకు క్రితం జరిగిన హత్య కేసులో తన ఇంట్లో ఉండే అంకిత్ ఖోకర్ను చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి కాల్వలో విసిరిన యూపీలోని ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్కు చెందిన ఉమేష్ శర్మ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోటి రూపాయల అత్యాశతో పీహెచ్డీ విద్యార్థి అంకిత్ను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంటి యజమానిని మాత్రమే కాకుండా హంతకుడి స్నేహితుడైన పర్వేష్ను కూడా అరెస్టు చేశారు. ఈ సంఘటన అక్టోబర్ 5న రాత్రి జరిగింది. నిందితుడి ఇంటి నుంచి మృతదేహాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించిన రంపాలు, కాలిపోయిన బట్టలు,అంకిత్ జుట్టు,రక్తం మరకలు కనుగొనబడ్డాయి. ఇతరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.
యూపీలోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన అంకిత్ ఖోకర్ తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి ఒంటరిగా నివసిస్తున్నాడు. అతను లక్నోలోని ఒక విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నాడు. అంకిత్ ఖోకర్ ఫోన్కు అతని స్నేహితులు మూడు వారాల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కేవలం మెసేజ్లు మాత్రమే చేస్తున్నాడు. దీంతో ఖోకర్ ఘజియాబాద్ చేరుకున్నారు. ఖోకర్ కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. సందేశాలు మాత్రమే రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు.. అక్టోబర్ 5న రాత్రి అంకిత్ ఖోకర్ను హత్య చేసినట్లు కనుగొన్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మోడీనగర్కు చెందిన ఉమేష్ శర్మ అనే వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. అంకిత్ ఖోకర్ కొద్ది నెలల క్రితం బాగ్పత్లోని తన పూర్వీకుల భూమిని విక్రయించాడు. అతనికి భూమి అమ్మగా రూ.1 కోటి వచ్చాయి. వాటిపై కన్నేసిన ఉమేష్ శర్మ.. తనకు రూ.40 లక్షలు అప్పు ఇవ్వాల్సిందిగా ఖోకర్ను కోరాడు. దీంతో ఖోకర్ ఉమేష్ కు రూ.40 లక్షలు ఇచ్చాడు.
Also Read
Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ
అక్టోబరు 5న అంకిత్ ఖోకర్ను గొంతుకోసి హత్య చేసినట్లు కనుగొన్నామని పోలీసులు చెప్పారు; అప్పుడు ఒక రంపాన్ని ఉపయోగించి శరీరాన్ని కనీసం మూడు భాగాలుగా నరికి, వాటిని అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేశాడని వెల్లడించారు. అతను ఒక భాగాన్ని ముజఫర్నగర్లోని ఖతౌలీ వద్ద ఉన్న కాలువలో, మరొక భాగాన్ని ముస్సోరీ కాలువలో, కొంత భాగాన్ని ఎక్స్ప్రెస్వేపై పడవేశాడు. భాగాలు దొరకాల్సి ఉంది. హత్య చేసిన తర్వాత కూడా బాధితుడి ఖాతాల నుంచి రూ.20 లక్షలు విత్డ్రా చేశాడు. మరిన్ని డబ్బుల కోసం తన స్నేహితుడు ప్రవేశ్కి ఇచ్చి ఉత్తరాఖండ్లో విత్డ్రా చేయమని చెప్పాడు. బాధితుడి మొబైల్ ఫోన్ కూడా తీసుకోమని చెప్పాడు.
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!