Parakram Diwas: అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unnamed Islands Of Andamans To Be Named After Param Vir Chakra Awardees: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు జనవరి 23న భారతదేశం ‘పరాక్రమ్ దివాస్’ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పేరులేని 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. జనవరి 23న ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, 2018లో ప్రధాని మోదీ అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్ కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గా పేరుపెట్టారు. నీల్, హావ్ లాక్ ద్వాపాలకు షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ గా పేర్లు పెట్టారు.
ప్రస్తుతం పేరు లేని 21 దీవులకు మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్- గౌరవ కెప్టెన్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్, కెప్టెన్ జిఎస్ సలారియా, లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్,
లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయబ్ సుబేదార్ బానా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ (రిటైర్డ్) పేర్లను పెట్టనున్నారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
- Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
- Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
- BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
దేశంలో నిజజీవితంలోని హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది. పేరు లేని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత, రెండవ అతిపెద్ద ద్వీపానికి రెండ పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరుపెట్టనున్నారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత కాపాడేందుకు త్యాగం చేసిన వీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఏమైంది.. బ్యాటింగ్ చేస్తూ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్..
-
Fauzi Release Date: డిసెంబర్ 3న ఫౌజీ రావడం కష్టమేనా? ప్రభాస్ మూవీపై పెరిగిన టెన్షన్!
-
IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
-
Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
-
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!