Site icon NTV Telugu

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి గోయల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Cm Chandrababu

Cm Chandrababu

ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. రాష్ట్రం లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై సీఎం కేంద్ర మంత్రి కివినతి పత్రం అందించారు. తాజా రాజకీయ పరిణామాలు.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర సహాయం అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత గుంటూరు టొబాకో బోర్డ్ కు బయలుదేరారు పీయూష్ గోయల్.. రేపు తిరుమలకు వెళ్లనున్నారు.

Exit mobile version