Bandi Sanjay: అందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తాం..
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన
- కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష
- ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి- బండి సంజయ్
- జిల్లాలో సంపూర్ణత అభియాన్ విజయవంతంగా సాగుతుంది- బండి సంజయ్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత జిల్లాలు, మండలాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కాని ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలి.. అభివృద్ధి అయిన ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. దేశంలో 112 వెనుకబడిన జిల్లాలను, దేశవ్యాప్తంగా 500 మండలాలను నీతి అయోగ్ గుర్తించిందని తెలిపారు. ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తామని కేంద్రమంత్రి పేర్కొ్న్నారు. మరోవైపు.. జిల్లాలో సంపూర్ణత అభియాన్ విజయవంతంగా సాగుతుందని బండి సంజయ్ చెప్పారు.
Read Also: Explosion In IOCL: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
అనంతరం మహముత్తారం మండలంలో పర్యటించారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను తిలకించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫలాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మోడీ ప్రభుత్వం పేదల కోసం కష్టపడి పనిచేస్తుంది.. పీఎం మోడి ఆదేశాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నానని అన్నారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు అభివృద్ధి నోచుకోని గ్రామాలు ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. సంపూర్ణత అభియాన్ కింద దేశవ్యాప్తంగా 500 మండలాలు ఎంపిక చేశామని.. రాష్ట్రంలో 10 బ్లాక్ లు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద మహాముత్తారం మండలం ఎంపికైందన్నారు.
నీతి అయోగ్ లో భూపాలపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలవాలని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతేనే, దేశం అభివృద్ధి చెందుతుందని బండి సంజయ్ తెలిపారు. కాగా.. మారుమూల మండలంలో కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత చేపట్టారు.
Read Also: Minister Kolusu Parthasarathy: మరో రెండు పథకాల అమలు.. బడ్జెట్లో నిధుల కేటాయింపు..
తాజావార్తలు
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!