Site icon NTV Telugu

Union Minister Prahlad Joshi: తెలంగాణ ప్రజలపై మోడీకి ప్రేమ.. బడ్జెట్‌పై తప్పుడు ప్రచారం తగదు

Prahlad Joshi

Prahlad Joshi

Prahlad Joshi: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047వరకు వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో ప్రసంగించారు. ప్రపంచంలోనే భారత్ ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మోడీ కృషి చేస్తున్నారని చెప్పారు.. ఏఐ జనరేషన్ నడుస్తున్న పరిస్థితుల్లో కొత్త సంస్కరణలు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.. స్వాతంత్ర్యం సిద్ధించాక కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించింది.. ప్రపంచంలోనే భారత్ మూడోవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.. ఇది భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని రూపొందించిన బడ్జెట్ అని.. ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశామని చెప్పారు.. కొంత మంది వ్యక్తులు బడ్జెట్ ను విమర్శిస్తున్నారని.. తెలంగాణకు ఏమీ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.. 5 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులు ఇచ్చామని చెప్పారు..

READ MORE: Delhi Shocking: ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం.. గుంతలో పడి యువకుడి మృతి

పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు నిధులతో పాటు గ్రాంట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.. “ఆత్మ నిర్భర భారత్ కింద తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లు ఆధునికీకరించాం.. ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లలో.. మూడు హైదరాబాద్ కే కేంద్రం ఇచ్చింది.. కొన్ని పార్టీల నాయకులు తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజల పట్ల మోడీకి ప్రేమ ఉంది.. మోడీపైన తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉంది.. వీబీ జీ రామ్ జీ వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేశారని తప్పుడు ప్రచారం చేశారు.. వీబీ జీ రామ్ జీకి బడ్జెట్లో గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది..” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

READ MORE: Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!

Exit mobile version