Union Budget 2023: ఎలక్ట్రానిక్స్ చౌక.. బంగారం, సిగరెట్లు ప్రియం.. ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే..

Products

Products

Union Budget 2023: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు.నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు. కేంద్ర బడ్జెట్‌లో మొబైల్స్‌, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. అలాగే సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది.

చౌకగా లేదా ప్రియంగా మారిన ఉత్పత్తుల జాబితా..

కెమెరా లెన్స్‌ల కోసం సంవత్సరం కస్టమ్స్ సుంకం నుంచి ఉపశమనం

టీవీ విడిభాగాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించబడింది.

ప్లాటినంపై సుంకంతో సరిపోయేలా వెండిపై దిగుమతి సుంకం పెంచబడుతుంది.

మూలధన వస్తువుల దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ప్రతిపాదించబడింది.

లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన యంత్రాలకు కస్టమ్స్ సుంకం మినహాయింపులు ప్రతిపాదించబడ్డాయి.

రొయ్యల మేత ఇన్‌పుట్‌లపై కస్టమ్స్ సుంకం తగ్గించబడింది.

సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది. దీంతో సిగరెట్ల ధరలు పెరగనున్నాయి.

 

దేశంలో తదుపరి లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరగనున్నందున ఈ ఏడాది బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) వార్షిక బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10న ప్రారంభమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కొవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని ప్రకటించింది.