Pakistan: 26/11 ఉగ్రదాడి సూత్రధారి, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) పాకిస్థాన్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని పాక్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో పాకిస్థాన్లోని ప్రతి జాతీయ, ప్రావిన్సు అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నివేదిక ప్రకారం నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127, లాహోర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాడు.
Read Also: Christmas Drone Show: క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం.. గిన్నిస్ రికార్డుకు ఎక్కిన డ్రోన్ షో
ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి జైలులో ఉన్నాడు. సయీద్పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) లష్కరే తోయిబా (LeT) యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్, ఇది ఆరుగురు అమెరికన్లతో సహా 166 మందిని చంపిన 2008 ముంబై దాడికి బాధ్యత వహించింది.
Read Also: Toilet remark row: “సౌత్ ఇండియన్స్ నల్లగా ఉంటారు”.. బీజేపీ నేత పాత వీడియోని పోస్ట్ చేసిన డీఎంకే..
పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు ‘కుర్చీ’గా తెలిసింది. పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో, తమ పార్టీ చాలా జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయాలని, పాకిస్థాన్ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని తాము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. అదే సమయంలో, ఖలీద్ మసూద్ సింధు NA-130 లాహోర్ నుంచి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై పోటీ చేయనున్నారు. హఫీజ్ సయీద్కు పార్టీకి సంబంధాలను ఖలీద్ మసూద్ సింధు ఖండించారు. హఫీజ్ సయీద్కు మా పార్టీకి ఎలాంటి మద్దతు లేదు’ అని ఆయన పేర్కొన్నారు.