Aadhaar: మీ పిల్లల ఆధార్ను అప్డేట్ చేయలేదా?.. UIDAI కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్!
- UIDAI కీలక నిర్ణయం
- ఇకపై స్కూల్లోనే అప్ డేషన్
- 45-60 రోజుల్లో అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్ తప్పనిసరి. చేసుకోకపోతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఆధార్ అప్ డేట్ ను సులభతరం చేయడానికి యుఐడిఎఐ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కింద బాల్ ఆధార్ను అప్ డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉండదు. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టింది.
Also Read:Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. 16 మంది మృతి
Also Read
పిటిఐ నివేదిక ప్రకారం.. యుఐడిఎఐ త్వరలో పాఠశాలల్లోనే పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నవీకరణను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని కింద, ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపుతారు. ఇక్కడి నుండి వాటిని ఒక పాఠశాల నుంచి మరొక స్థానిక పాఠశాలకు పంపుతారు. ఈ పని దశలవారీగా పూర్తవుతుందని ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. ఆధార్ అథారిటీ పాఠశాలల ద్వారా ఆధార్ కార్డులను అప్ డేట్ చేసే చర్యలను ప్రారంభించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేష్ కుమార్ ప్రకారం, పిల్లల బయోమెట్రిక్ నవీకరణలను ప్రారంభించే ప్రాజెక్ట్పై పని జరుగుతోంది. సాంకేతికతను పరీక్షిస్తున్నామని.. 45-60 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Also Read:Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
ఆధార్ కార్డులను బయోమెట్రిక్స్తో అప్డేట్ చేయని పిల్లల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఇప్పుడు అది 7 కోట్లు దాటిందని భువనేష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అని, ఈ సంఖ్య పెరుగుతున్నందున, పాఠశాలల ద్వారా ఈ పనిని ఆలస్యం చేయకుండా చేయడానికి UIDAI ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!