Aadhaar: మీ పిల్లల ఆధార్ను అప్డేట్ చేయలేదా?.. UIDAI కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్!
- UIDAI కీలక నిర్ణయం
- ఇకపై స్కూల్లోనే అప్ డేషన్
- 45-60 రోజుల్లో అందుబాటులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్ తప్పనిసరి. చేసుకోకపోతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఆధార్ అప్ డేట్ ను సులభతరం చేయడానికి యుఐడిఎఐ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కింద బాల్ ఆధార్ను అప్ డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉండదు. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టింది.
Also Read:Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. 16 మంది మృతి
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
పిటిఐ నివేదిక ప్రకారం.. యుఐడిఎఐ త్వరలో పాఠశాలల్లోనే పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నవీకరణను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని కింద, ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపుతారు. ఇక్కడి నుండి వాటిని ఒక పాఠశాల నుంచి మరొక స్థానిక పాఠశాలకు పంపుతారు. ఈ పని దశలవారీగా పూర్తవుతుందని ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. ఆధార్ అథారిటీ పాఠశాలల ద్వారా ఆధార్ కార్డులను అప్ డేట్ చేసే చర్యలను ప్రారంభించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేష్ కుమార్ ప్రకారం, పిల్లల బయోమెట్రిక్ నవీకరణలను ప్రారంభించే ప్రాజెక్ట్పై పని జరుగుతోంది. సాంకేతికతను పరీక్షిస్తున్నామని.. 45-60 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Also Read:Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
ఆధార్ కార్డులను బయోమెట్రిక్స్తో అప్డేట్ చేయని పిల్లల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఇప్పుడు అది 7 కోట్లు దాటిందని భువనేష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అని, ఈ సంఖ్య పెరుగుతున్నందున, పాఠశాలల ద్వారా ఈ పనిని ఆలస్యం చేయకుండా చేయడానికి UIDAI ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!