Aadhaar: మీ పిల్లల ఆధార్ను అప్డేట్ చేయలేదా?.. UIDAI కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్!
- UIDAI కీలక నిర్ణయం
- ఇకపై స్కూల్లోనే అప్ డేషన్
- 45-60 రోజుల్లో అందుబాటులోకి
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ బయోమెట్రిక్స్ అప్ డేట్ తప్పనిసరి. చేసుకోకపోతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఆధార్ అప్ డేట్ ను సులభతరం చేయడానికి యుఐడిఎఐ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కింద బాల్ ఆధార్ను అప్ డేట్ చేయడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం ఉండదు. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టింది.
Also Read:Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. 16 మంది మృతి
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
పిటిఐ నివేదిక ప్రకారం.. యుఐడిఎఐ త్వరలో పాఠశాలల్లోనే పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ నవీకరణను ప్రారంభించాలని యోచిస్తోంది. దీని కింద, ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపుతారు. ఇక్కడి నుండి వాటిని ఒక పాఠశాల నుంచి మరొక స్థానిక పాఠశాలకు పంపుతారు. ఈ పని దశలవారీగా పూర్తవుతుందని ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు. ఆధార్ అథారిటీ పాఠశాలల ద్వారా ఆధార్ కార్డులను అప్ డేట్ చేసే చర్యలను ప్రారంభించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భువనేష్ కుమార్ ప్రకారం, పిల్లల బయోమెట్రిక్ నవీకరణలను ప్రారంభించే ప్రాజెక్ట్పై పని జరుగుతోంది. సాంకేతికతను పరీక్షిస్తున్నామని.. 45-60 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
Also Read:Mohanbabu : ‘కోట’ చనిపోతే అందుకే వెళ్లలేదు.. మోహన్ బాబు కామెంట్స్..
ఆధార్ కార్డులను బయోమెట్రిక్స్తో అప్డేట్ చేయని పిల్లల సంఖ్య నిరంతరం పెరుగుతోందని, ఇప్పుడు అది 7 కోట్లు దాటిందని భువనేష్ కుమార్ అన్నారు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి అని, ఈ సంఖ్య పెరుగుతున్నందున, పాఠశాలల ద్వారా ఈ పనిని ఆలస్యం చేయకుండా చేయడానికి UIDAI ఒక ప్రణాళికను సిద్ధం చేసిందని వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!