NTV Telugu Site icon

Godavari River: విషాదం.. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు

Godavari

Godavari

Godavari River: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వశిష్ట గోదావరిలో బోటు బోల్తా పడగా.. యువకులు నదిలో మునిగిపోయారు. కొబ్బరికాయల లోడు అధిక బరువుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Read Also: Rahul Gandhi : లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. పడవలో అధిక లోడు కారణంగానే ఈ పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. నదిలో మునిగిపోయిన ఇద్దరు యువకుల ఆచూకీ గురించి తీవ్రంగా ఆరా తీస్తున్నారు.