Two Ships Sink : ఘోర ప్రమాదం.. రెండు నౌకలు మునిగి 11 మంది మృతి, 64 మంది గల్లంతు
- ఇటలీ తీరంతో మునిగిన రెండు నౌకలు
- ప్రమాదంలో 11 మంది మృతి 64 మంది గల్లంతు
- 10మృతదేహాలను కనుగొన్న రెస్క్యూ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Ships Sink : ఇటలీలోని దక్షిణ తీరంలో సోమవారం రెండు నౌకలు మునిగిపోవడంతో 64 మంది సముద్రంలో గల్లంతయ్యారు.. 11 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయి. ఇప్పటివరకు 11 మందిని రక్షించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. జర్మన్ సహాయక బృందం రెస్క్యూషిప్ సోమవారం ‘ట్విట్టర్’లో ఒక పోస్ట్లో మాట్లాడుతూ.. ఓడ ప్రమాదంలో ఇటలీలోని చిన్న ద్వీపం లాంపెడుసా సమీపంలో 10 మంది మృతదేహాలను రెస్క్యూ కార్మికులు కనుగొన్నట్లు పేర్కొంది.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ఇటాలియన్ కోస్ట్ గార్డ్ సోమవారం అర్థరాత్రి వరకు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా తీరానికి 120 మైళ్ల (193 కిమీ) దూరంలో చిక్కుకుపోయిన పడవ గురించి సమాచారం అందుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. మర్చంట్ షిప్ 12 మందిని కాపాడింది. నౌక మునిగిపోవడంతో ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ఇటాలియన్ పెట్రోలింగ్ బోట్లు, ATR 42 విమానం ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. సోమవారం సాయంత్రం వరకు మరెవరూ సజీవంగా కనిపించలేదు. ఇరాక్, సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలసదారులు, శరణార్థులను తీసుకువెళుతున్న పడవ గత వారం టర్కీ నుండి బయలుదేరిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
Read Also:PGCIL Recruitment 2024 : పవర్ గ్రిడ్ లో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
ఇంతకుముందు జరిగిన ప్రమాదంలో జర్మన్ సహాయక బృందం రెస్క్యూషిప్తో పాటు రెస్క్యూ టీమ్ 10 మంది వలసదారులను చనిపోయినట్లు కనుగొన్నారు. ఇటలీ దక్షిణ ద్వీపం లాంపెడుసా నుండి మాల్టా సమీపంలో ఒక పడవలో ఉన్న మరో 51 మందిని రక్షించగలిగారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈజిప్ట్, సిరియా నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యధరా సముద్రంలో పడవలో ప్రయాణించే వలసదారులు వాతావరణ ప్రభావం, నాణ్యత లేని నౌకల కారణంగా ఇటువంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు సముద్రం దాటుతున్నప్పుడు దాదాపు వెయ్యి మంది మరణించారు. గతేడాది 2023లో 3155 మంది అదృశ్యమయ్యారు.
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..