Two Ships Sink : ఘోర ప్రమాదం.. రెండు నౌకలు మునిగి 11 మంది మృతి, 64 మంది గల్లంతు
- ఇటలీ తీరంతో మునిగిన రెండు నౌకలు
- ప్రమాదంలో 11 మంది మృతి 64 మంది గల్లంతు
- 10మృతదేహాలను కనుగొన్న రెస్క్యూ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Ships Sink : ఇటలీలోని దక్షిణ తీరంలో సోమవారం రెండు నౌకలు మునిగిపోవడంతో 64 మంది సముద్రంలో గల్లంతయ్యారు.. 11 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగతున్నాయి. ఇప్పటివరకు 11 మందిని రక్షించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. జర్మన్ సహాయక బృందం రెస్క్యూషిప్ సోమవారం ‘ట్విట్టర్’లో ఒక పోస్ట్లో మాట్లాడుతూ.. ఓడ ప్రమాదంలో ఇటలీలోని చిన్న ద్వీపం లాంపెడుసా సమీపంలో 10 మంది మృతదేహాలను రెస్క్యూ కార్మికులు కనుగొన్నట్లు పేర్కొంది.
Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
ఇటాలియన్ కోస్ట్ గార్డ్ సోమవారం అర్థరాత్రి వరకు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా తీరానికి 120 మైళ్ల (193 కిమీ) దూరంలో చిక్కుకుపోయిన పడవ గురించి సమాచారం అందుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. మర్చంట్ షిప్ 12 మందిని కాపాడింది. నౌక మునిగిపోవడంతో ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ఇటాలియన్ పెట్రోలింగ్ బోట్లు, ATR 42 విమానం ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. సోమవారం సాయంత్రం వరకు మరెవరూ సజీవంగా కనిపించలేదు. ఇరాక్, సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలసదారులు, శరణార్థులను తీసుకువెళుతున్న పడవ గత వారం టర్కీ నుండి బయలుదేరిందని ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
Read Also:PGCIL Recruitment 2024 : పవర్ గ్రిడ్ లో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..
ఇంతకుముందు జరిగిన ప్రమాదంలో జర్మన్ సహాయక బృందం రెస్క్యూషిప్తో పాటు రెస్క్యూ టీమ్ 10 మంది వలసదారులను చనిపోయినట్లు కనుగొన్నారు. ఇటలీ దక్షిణ ద్వీపం లాంపెడుసా నుండి మాల్టా సమీపంలో ఒక పడవలో ఉన్న మరో 51 మందిని రక్షించగలిగారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈజిప్ట్, సిరియా నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యధరా సముద్రంలో పడవలో ప్రయాణించే వలసదారులు వాతావరణ ప్రభావం, నాణ్యత లేని నౌకల కారణంగా ఇటువంటి ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు సముద్రం దాటుతున్నప్పుడు దాదాపు వెయ్యి మంది మరణించారు. గతేడాది 2023లో 3155 మంది అదృశ్యమయ్యారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!