Site icon NTV Telugu

Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం

Attack

Attack

డబ్బు మాయలో పడి మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. ఆస్తిపాస్తుల కోసం అయినవారిని కడతేర్చుతున్నారు. ఇటీవల ఓ అన్న తన చెల్లిని భూమి కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా చేయించి.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నించారు ఇద్దరు వ్యక్తులు. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ లో రూ. కోటి బీమా కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసేందుకు పథకం వేశారు. బీరు బాటిల్స్ తో తలపై కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు బూర్గంపాడు పోలీసులు తెలిపారు. యువకుడి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Exit mobile version