డబ్బు మాయలో పడి మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. ఆస్తిపాస్తుల కోసం అయినవారిని కడతేర్చుతున్నారు. ఇటీవల ఓ అన్న తన చెల్లిని భూమి కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా చేయించి.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నించారు ఇద్దరు వ్యక్తులు. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ లో రూ. కోటి బీమా కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని…