Bangladesh Crisis : మీకు తెలుసా.. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని, దేశ జెండాను రూపొందించింది హిందువులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్ జాతీయ గీతం బెంగాలీ, సంస్కృతం భాషల మిశ్రమంగా రూపొంచించబడింది. ఇది 1972 నుండి ‘అమర్ సోనార్ బంగ్లా…’ దేశ గీతంగా అమల్లోకి వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన ఓ చిన్నారి పాడింది. ఇది ఒక భారతీయుడు వ్రాసాడని.. అతను హిందూ మతానికి చెందినవాడు. అతని సాహిత్యం మొత్తం బెంగాల్ను ఆకర్షించింది. అదేవిధంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎప్పుడు తయారు చేశారు అనే కథ కూడా ఆసక్తికరంగా ఉంది. దీనిని ఢాకాలో నివసిస్తున్న ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన దుస్తులతో తయారు చేయబడింది. ఢాకాలో నివసిస్తున్న ఒక హిందూ డిజైనర్ దీన్ని తయారు చేశారు.
ముందుగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం. ఆ వ్యక్తి బంగ్లాదేశ్ డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ శిబ్ నారాయణ్ దాస్. అతను విద్యార్థి నాయకుడు. తరువాత డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ అయ్యాడు. బంగ్లాదేశ్ జెండా, ఆకుపచ్చ చతురస్రం లోపల పెద్ద ఎర్రటి వృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది అతనే రూపొందించాడు. శివనారాయణ్ దాస్ ఢాకాకు చెందిన వ్యక్తి. తర్వాత ఈ జెండాలో కొన్ని మార్పులు చేశారు. అతను 1972లో ఈ జెండాను తయారు చేసినప్పుడు, ఈ ఎర్రటి వృత్తంలో బంగ్లాదేశ్ పసుపు రంగు మ్యాప్ కూడా ఉంది, తరువాత దానిని తొలగించారు. ఎందుకంటే జెండాకు రెండు వైపులా ఒకే విధంగా కనిపించేలా చేయడం చాలా కష్టమైన పని. నారాయణ్ దాస్ 77 సంవత్సరాల వయస్సులో ఢాకాలో ఏప్రిల్ 19న మరణించారు.
Also Read
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్కు పెళ్లి..?
Read Also:IT Minister Sridhar Babu: ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా హైదరాబాద్..
ఈ జెండా ఏం చెబుతోంది?
జెండాలో ఉన్న ఆకుపచ్చ నేపథ్యం బంగ్లాదేశ్ పచ్చని వ్యవసాయాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న ఎరుపు వృత్తం స్వాతంత్ర్య పోరాటంలో బంగ్లాదేశీయులు చిందిన రక్తాన్ని సూచిస్తుంది.
జాతీయ గీతాన్ని ఎవరు రాశారు
ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారో చూద్దాం. దీనిని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఇది బెంగాలీ భాషలో ఉంది. 1906లో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు బెంగాల్ను మత ప్రాతిపదికన రెండు భాగాలుగా విభజించినప్పుడు ఆయన దీనిని రాశారు. ఈ పాట బెంగాల్ సమైక్యత కోసం ఒక వాతావరణాన్ని సృష్టించడానికి వ్రాయబడింది. 1972లో బంగ్లాదేశ్ స్వతంత్రం అయినప్పుడు, ఈ పాటలోని మొదటి పది లైన్లను జాతీయ గీతంగా అంగీకరించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం రెండు దేశాల జాతీయ గీతంగా మారింది. ప్రపంచంలోనే రెండు దేశాలకు జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రచించిన జన-గణ మన, భారత రాజ్యాంగ సభ 24 జనవరి 1950న అధికారికంగా భారత జాతీయ గీతంగా ఆమోదించబడింది. 22 సంవత్సరాల తరువాత, జనవరి 13, 1972 తర్వాత ఆయన రాసిన “అమర్ సోనార్ బంగ్లా” అధికారికంగా బంగ్లాదేశ్ జాతీయ గీతంగా గుర్తించబడింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!