Bangladesh Crisis : మీకు తెలుసా.. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని, దేశ జెండాను రూపొందించింది హిందువులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్ జాతీయ గీతం బెంగాలీ, సంస్కృతం భాషల మిశ్రమంగా రూపొంచించబడింది. ఇది 1972 నుండి ‘అమర్ సోనార్ బంగ్లా…’ దేశ గీతంగా అమల్లోకి వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన ఓ చిన్నారి పాడింది. ఇది ఒక భారతీయుడు వ్రాసాడని.. అతను హిందూ మతానికి చెందినవాడు. అతని సాహిత్యం మొత్తం బెంగాల్ను ఆకర్షించింది. అదేవిధంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎప్పుడు తయారు చేశారు అనే కథ కూడా ఆసక్తికరంగా ఉంది. దీనిని ఢాకాలో నివసిస్తున్న ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన దుస్తులతో తయారు చేయబడింది. ఢాకాలో నివసిస్తున్న ఒక హిందూ డిజైనర్ దీన్ని తయారు చేశారు.
ముందుగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం. ఆ వ్యక్తి బంగ్లాదేశ్ డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ శిబ్ నారాయణ్ దాస్. అతను విద్యార్థి నాయకుడు. తరువాత డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ అయ్యాడు. బంగ్లాదేశ్ జెండా, ఆకుపచ్చ చతురస్రం లోపల పెద్ద ఎర్రటి వృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది అతనే రూపొందించాడు. శివనారాయణ్ దాస్ ఢాకాకు చెందిన వ్యక్తి. తర్వాత ఈ జెండాలో కొన్ని మార్పులు చేశారు. అతను 1972లో ఈ జెండాను తయారు చేసినప్పుడు, ఈ ఎర్రటి వృత్తంలో బంగ్లాదేశ్ పసుపు రంగు మ్యాప్ కూడా ఉంది, తరువాత దానిని తొలగించారు. ఎందుకంటే జెండాకు రెండు వైపులా ఒకే విధంగా కనిపించేలా చేయడం చాలా కష్టమైన పని. నారాయణ్ దాస్ 77 సంవత్సరాల వయస్సులో ఢాకాలో ఏప్రిల్ 19న మరణించారు.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
Read Also:IT Minister Sridhar Babu: ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా హైదరాబాద్..
ఈ జెండా ఏం చెబుతోంది?
జెండాలో ఉన్న ఆకుపచ్చ నేపథ్యం బంగ్లాదేశ్ పచ్చని వ్యవసాయాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న ఎరుపు వృత్తం స్వాతంత్ర్య పోరాటంలో బంగ్లాదేశీయులు చిందిన రక్తాన్ని సూచిస్తుంది.
జాతీయ గీతాన్ని ఎవరు రాశారు
ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారో చూద్దాం. దీనిని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఇది బెంగాలీ భాషలో ఉంది. 1906లో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు బెంగాల్ను మత ప్రాతిపదికన రెండు భాగాలుగా విభజించినప్పుడు ఆయన దీనిని రాశారు. ఈ పాట బెంగాల్ సమైక్యత కోసం ఒక వాతావరణాన్ని సృష్టించడానికి వ్రాయబడింది. 1972లో బంగ్లాదేశ్ స్వతంత్రం అయినప్పుడు, ఈ పాటలోని మొదటి పది లైన్లను జాతీయ గీతంగా అంగీకరించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం రెండు దేశాల జాతీయ గీతంగా మారింది. ప్రపంచంలోనే రెండు దేశాలకు జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రచించిన జన-గణ మన, భారత రాజ్యాంగ సభ 24 జనవరి 1950న అధికారికంగా భారత జాతీయ గీతంగా ఆమోదించబడింది. 22 సంవత్సరాల తరువాత, జనవరి 13, 1972 తర్వాత ఆయన రాసిన “అమర్ సోనార్ బంగ్లా” అధికారికంగా బంగ్లాదేశ్ జాతీయ గీతంగా గుర్తించబడింది.
తాజావార్తలు
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!