Bangladesh Crisis : మీకు తెలుసా.. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని, దేశ జెండాను రూపొందించింది హిందువులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Crisis : బంగ్లాదేశ్ జాతీయ గీతం బెంగాలీ, సంస్కృతం భాషల మిశ్రమంగా రూపొంచించబడింది. ఇది 1972 నుండి ‘అమర్ సోనార్ బంగ్లా…’ దేశ గీతంగా అమల్లోకి వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన ఓ చిన్నారి పాడింది. ఇది ఒక భారతీయుడు వ్రాసాడని.. అతను హిందూ మతానికి చెందినవాడు. అతని సాహిత్యం మొత్తం బెంగాల్ను ఆకర్షించింది. అదేవిధంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎప్పుడు తయారు చేశారు అనే కథ కూడా ఆసక్తికరంగా ఉంది. దీనిని ఢాకాలో నివసిస్తున్న ఒక వ్యాపారవేత్త విరాళంగా ఇచ్చిన దుస్తులతో తయారు చేయబడింది. ఢాకాలో నివసిస్తున్న ఒక హిందూ డిజైనర్ దీన్ని తయారు చేశారు.
ముందుగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఎవరు తయారు చేశారో తెలుసుకుందాం. ఆ వ్యక్తి బంగ్లాదేశ్ డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ శిబ్ నారాయణ్ దాస్. అతను విద్యార్థి నాయకుడు. తరువాత డిజైనర్, వెక్సిల్లోగ్రాఫర్ అయ్యాడు. బంగ్లాదేశ్ జెండా, ఆకుపచ్చ చతురస్రం లోపల పెద్ద ఎర్రటి వృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది అతనే రూపొందించాడు. శివనారాయణ్ దాస్ ఢాకాకు చెందిన వ్యక్తి. తర్వాత ఈ జెండాలో కొన్ని మార్పులు చేశారు. అతను 1972లో ఈ జెండాను తయారు చేసినప్పుడు, ఈ ఎర్రటి వృత్తంలో బంగ్లాదేశ్ పసుపు రంగు మ్యాప్ కూడా ఉంది, తరువాత దానిని తొలగించారు. ఎందుకంటే జెండాకు రెండు వైపులా ఒకే విధంగా కనిపించేలా చేయడం చాలా కష్టమైన పని. నారాయణ్ దాస్ 77 సంవత్సరాల వయస్సులో ఢాకాలో ఏప్రిల్ 19న మరణించారు.
Also Read
- Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
Read Also:IT Minister Sridhar Babu: ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా హైదరాబాద్..
ఈ జెండా ఏం చెబుతోంది?
జెండాలో ఉన్న ఆకుపచ్చ నేపథ్యం బంగ్లాదేశ్ పచ్చని వ్యవసాయాన్ని సూచిస్తుంది. మధ్యలో ఉన్న ఎరుపు వృత్తం స్వాతంత్ర్య పోరాటంలో బంగ్లాదేశీయులు చిందిన రక్తాన్ని సూచిస్తుంది.
జాతీయ గీతాన్ని ఎవరు రాశారు
ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారో చూద్దాం. దీనిని గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఇది బెంగాలీ భాషలో ఉంది. 1906లో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు బెంగాల్ను మత ప్రాతిపదికన రెండు భాగాలుగా విభజించినప్పుడు ఆయన దీనిని రాశారు. ఈ పాట బెంగాల్ సమైక్యత కోసం ఒక వాతావరణాన్ని సృష్టించడానికి వ్రాయబడింది. 1972లో బంగ్లాదేశ్ స్వతంత్రం అయినప్పుడు, ఈ పాటలోని మొదటి పది లైన్లను జాతీయ గీతంగా అంగీకరించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం రెండు దేశాల జాతీయ గీతంగా మారింది. ప్రపంచంలోనే రెండు దేశాలకు జాతీయ గీతాలను రాసిన ఏకైక వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రచించిన జన-గణ మన, భారత రాజ్యాంగ సభ 24 జనవరి 1950న అధికారికంగా భారత జాతీయ గీతంగా ఆమోదించబడింది. 22 సంవత్సరాల తరువాత, జనవరి 13, 1972 తర్వాత ఆయన రాసిన “అమర్ సోనార్ బంగ్లా” అధికారికంగా బంగ్లాదేశ్ జాతీయ గీతంగా గుర్తించబడింది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!