Somalia Explosions: సోమాలియాలో వరుస బాంబు పేలుళ్లు.. కంపించిపోయిన రాజధాని మొగడిష్ నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somalia Explosions: భారీ పేలుళ్లతో సోమాలియా దేశం దద్దరిల్లిపోయింది. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. మరోవైపు ఆ దేశ రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందినట్లు చెందినట్లు సమాచారం.
సోమాలియా కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం సంభవించిన రెండు పేలుళ్లతో సోమాలియా రాజధాని మొగడిషు నగరం కంపించిపోయింది. రెండు వరుస పేలుళ్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రెండు కార్లలో బాంబుల పేలుడు ధాటికి పదుల సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రద్దీగా ఉండే జంక్షన్లో నిమిషాల గ్యాప్లో బాంబు పేలుళ్లు జరిగినట్లు చెప్పారు. పేలుడు ధాటికి వందల మీటర్ల ఎత్తులోకి దట్టమైన పొగలు విస్తరించాయి. కిలోమీటర్లమేర పరుచుకున్న పొగతో స్థానికులు ఊపిరిపీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. తొలుత ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర జరిగిన పేలుడులో ఓ అంబులెన్స్ ధ్వంసం కాగా.. రద్దీగా ఉండే ఓ రెస్టారెంట్ సమీపంలో మరో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాద ప్రాంతంలో సహాయకచర్యలు ముమ్మరం చేశామన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
Read Also: Raj Tarun: నీ అంతు చూస్తా.. మీకు ఆ అమ్మాయి కనపడితే చెప్పమంటున్న రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?
పేలుళ్లు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ పేలుళ్లలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రకటన జారీ చేయలేదు. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ జరుపుతున్న హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సమావేశమైన రోజునే.. ఈ పేలుల్లు జరుగడం విశేషం.
అల్ షబాబ్ తరచుగా హై-ప్రొఫైల్ ప్రదేశాలపై దాడులు చేస్తున్నది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈసారి పేలుళ్లకు కుట్రపన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2015 లో విద్యాశాఖపై ఒకసారి దాడి జరిగింది. జోబ్ జంక్షన్ వద్ద 2017 లో 500 మందికి పైగా మరణించిన పేలుళ్లకు అల్-షబాబ్ కారణమని తేలింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!