Turkey: దాడి తర్వాత ఇరాక్ పై బాంబుల వర్షం కురిపించిన టర్కీ.. 20కి పైగా స్థావరాలు ధ్వంసం
Turkey: ఇటీవల టర్కీలోని ప్రభుత్వ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోతున్న టర్కీ దానికి బాధ్యత వహించిన సంస్థ స్థావరాలను ధ్వంసం చేసింది. ఉత్తర ఇరాక్లోని 20కి పైగా అనుమానాస్పద లక్ష్యాలపై యుద్ధవిమానాలు బాంబు దాడి చేశాయి. ఆత్మాహుతి దాడికి బాధ్యతను కుర్దిష్ తిరుగుబాటు సంస్థ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ తీసుకుంది. టర్కీ ఈ సంస్థను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. దాడి తర్వాత నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్లో పీకేకే గుహలు, షెల్టర్లు, డిపోలు ధ్వంసమయ్యాయి. అంతకుముందు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంట్రీ పాయింట్ సమీపంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో దాడి చేశాడు. టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. వారిలో ఒకరు బాంబుతో తనను తాను పేల్చేసుకున్నాడు. మరొకరు అక్కడ ఉన్న భద్రతా దళాలచే చంపబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని పీకేకే ప్రకటించింది.
Read Also:Friday : గాంధీకి ఆ వారంతో బంధం.. కారణం ఇదీ..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ.. అంకారా బాంబు దాడులకు పాల్పడిన దాడిదారులు పౌరుల శాంతి, భద్రతకు ముప్పు కలిగించే తాజా ప్రయత్నాలలో విఫలమయ్యారు. పౌరుల శాంతి, భద్రతను బెదిరించే వారు తమ లక్ష్యాన్ని సాధించలేరని చెప్పాడు. టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్లచే తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన పీకేకే పొడిగింపుగా సిరియా ఆధారిత వైపీజీని టర్కీ చూస్తుంది. పీకేకే టర్కీకి వ్యతిరేకంగా 1984 నుండి తిరుగుబాటు చేస్తోంది. దాని ఘర్షణల్లో వేలాది మంది చనిపోయారు. గతేడాది ఇస్తాంబుల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దీనికి వైపీజీ, పీకేకేలను టర్కీ నిదించింది.
Read Also:Speaker Tammineni Sitaram: చంద్రబాబు, పవన్ ఆరు నెలలు ఓపిక పట్టండి
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం దాడికి ముందు, ఉగ్రవాదులు అంకారా నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహనాన్ని హైజాక్ చేశారు. దానిని ఉపయోగించి వారు అంకారాలోని ప్రభుత్వ భవనం సమీపంలోకి చేరుకున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ను కాల్చి చంపి మృతదేహాన్ని కాలువలో పడేశారు. వారు ప్రభుత్వ భవనం సమీపంలో దాడికి ప్రయత్నించారు. కానీ టర్కీ అధ్యక్షుడి ప్రకారం వారు విఫలమయ్యారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?