Turkey: దాడి తర్వాత ఇరాక్ పై బాంబుల వర్షం కురిపించిన టర్కీ.. 20కి పైగా స్థావరాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey: ఇటీవల టర్కీలోని ప్రభుత్వ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోతున్న టర్కీ దానికి బాధ్యత వహించిన సంస్థ స్థావరాలను ధ్వంసం చేసింది. ఉత్తర ఇరాక్లోని 20కి పైగా అనుమానాస్పద లక్ష్యాలపై యుద్ధవిమానాలు బాంబు దాడి చేశాయి. ఆత్మాహుతి దాడికి బాధ్యతను కుర్దిష్ తిరుగుబాటు సంస్థ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ తీసుకుంది. టర్కీ ఈ సంస్థను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. దాడి తర్వాత నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్లో పీకేకే గుహలు, షెల్టర్లు, డిపోలు ధ్వంసమయ్యాయి. అంతకుముందు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంట్రీ పాయింట్ సమీపంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో దాడి చేశాడు. టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. వారిలో ఒకరు బాంబుతో తనను తాను పేల్చేసుకున్నాడు. మరొకరు అక్కడ ఉన్న భద్రతా దళాలచే చంపబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని పీకేకే ప్రకటించింది.
Read Also:Friday : గాంధీకి ఆ వారంతో బంధం.. కారణం ఇదీ..
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ.. అంకారా బాంబు దాడులకు పాల్పడిన దాడిదారులు పౌరుల శాంతి, భద్రతకు ముప్పు కలిగించే తాజా ప్రయత్నాలలో విఫలమయ్యారు. పౌరుల శాంతి, భద్రతను బెదిరించే వారు తమ లక్ష్యాన్ని సాధించలేరని చెప్పాడు. టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్లచే తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన పీకేకే పొడిగింపుగా సిరియా ఆధారిత వైపీజీని టర్కీ చూస్తుంది. పీకేకే టర్కీకి వ్యతిరేకంగా 1984 నుండి తిరుగుబాటు చేస్తోంది. దాని ఘర్షణల్లో వేలాది మంది చనిపోయారు. గతేడాది ఇస్తాంబుల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దీనికి వైపీజీ, పీకేకేలను టర్కీ నిదించింది.
Read Also:Speaker Tammineni Sitaram: చంద్రబాబు, పవన్ ఆరు నెలలు ఓపిక పట్టండి
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం దాడికి ముందు, ఉగ్రవాదులు అంకారా నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహనాన్ని హైజాక్ చేశారు. దానిని ఉపయోగించి వారు అంకారాలోని ప్రభుత్వ భవనం సమీపంలోకి చేరుకున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ను కాల్చి చంపి మృతదేహాన్ని కాలువలో పడేశారు. వారు ప్రభుత్వ భవనం సమీపంలో దాడికి ప్రయత్నించారు. కానీ టర్కీ అధ్యక్షుడి ప్రకారం వారు విఫలమయ్యారు.
తాజావార్తలు
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!