Turkey: దాడి తర్వాత ఇరాక్ పై బాంబుల వర్షం కురిపించిన టర్కీ.. 20కి పైగా స్థావరాలు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey: ఇటీవల టర్కీలోని ప్రభుత్వ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోతున్న టర్కీ దానికి బాధ్యత వహించిన సంస్థ స్థావరాలను ధ్వంసం చేసింది. ఉత్తర ఇరాక్లోని 20కి పైగా అనుమానాస్పద లక్ష్యాలపై యుద్ధవిమానాలు బాంబు దాడి చేశాయి. ఆత్మాహుతి దాడికి బాధ్యతను కుర్దిష్ తిరుగుబాటు సంస్థ కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ తీసుకుంది. టర్కీ ఈ సంస్థను తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. దాడి తర్వాత నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్లో పీకేకే గుహలు, షెల్టర్లు, డిపోలు ధ్వంసమయ్యాయి. అంతకుముందు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంట్రీ పాయింట్ సమీపంలో ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో దాడి చేశాడు. టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. వారిలో ఒకరు బాంబుతో తనను తాను పేల్చేసుకున్నాడు. మరొకరు అక్కడ ఉన్న భద్రతా దళాలచే చంపబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని పీకేకే ప్రకటించింది.
Read Also:Friday : గాంధీకి ఆ వారంతో బంధం.. కారణం ఇదీ..
Also Read
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ.. అంకారా బాంబు దాడులకు పాల్పడిన దాడిదారులు పౌరుల శాంతి, భద్రతకు ముప్పు కలిగించే తాజా ప్రయత్నాలలో విఫలమయ్యారు. పౌరుల శాంతి, భద్రతను బెదిరించే వారు తమ లక్ష్యాన్ని సాధించలేరని చెప్పాడు. టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్లచే తీవ్రవాద సంస్థగా ప్రకటించబడిన పీకేకే పొడిగింపుగా సిరియా ఆధారిత వైపీజీని టర్కీ చూస్తుంది. పీకేకే టర్కీకి వ్యతిరేకంగా 1984 నుండి తిరుగుబాటు చేస్తోంది. దాని ఘర్షణల్లో వేలాది మంది చనిపోయారు. గతేడాది ఇస్తాంబుల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. దీనికి వైపీజీ, పీకేకేలను టర్కీ నిదించింది.
Read Also:Speaker Tammineni Sitaram: చంద్రబాబు, పవన్ ఆరు నెలలు ఓపిక పట్టండి
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం దాడికి ముందు, ఉగ్రవాదులు అంకారా నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాహనాన్ని హైజాక్ చేశారు. దానిని ఉపయోగించి వారు అంకారాలోని ప్రభుత్వ భవనం సమీపంలోకి చేరుకున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ను కాల్చి చంపి మృతదేహాన్ని కాలువలో పడేశారు. వారు ప్రభుత్వ భవనం సమీపంలో దాడికి ప్రయత్నించారు. కానీ టర్కీ అధ్యక్షుడి ప్రకారం వారు విఫలమయ్యారు.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!