TSRTC Milestone: మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. విజయవంతంగా 19 నెలలు!
- తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి
- నేడు 200 కోట్ల మార్క్
- రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు, బస్ స్టేషన్లలో సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Milestone: తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 199.71 కోట్ల జీరో టికెట్లను టీజీఎస్ ఆర్టీసీ జారీ చేయగా.. నేడు 200 కోట్ల మార్క్ తాకింది. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు చేయనున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహిళల కోసం తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకానికి భారీ ఆదరణ వస్తోంది. 19 నెలలుగా ఉచిత బస్సు పథకం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ జీరో టికెట్లను జారీ చేస్తోంది. బస్ టికెట్ల ఛార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది. మహిళలు ఉచిత ప్రయాణం కోసం రూ.6700 కోట్లు అయినట్లు ఆర్టీసీ పేర్కొంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
Also Read: Gold Rate Today: గోల్డ్ ప్రియులకు భారీ షాక్.. నేడు తులం బంగారం రేటు ఎంతో తెలుసా?
2023 డిసెంబరు 9న ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో ఉచిత పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ఆరంభంలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 35 లక్షలకు చేరింది. హైదరాబాద్లోనే 8 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ తీరు మారింది. గతంలో బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి 67 శాతం ఉంటే.. ఇప్పుడు అది 95 శాతానికి పెరిగింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!