గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై సౌత్ క్వీన్ త్రిష ఎట్టకేలకు స్పందించింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఎంతో చమత్కారంగా, అదే సమయంలో గట్టిగా తిప్పికొట్టింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెడుతూ.. ‘నేను సినిమాలకు గుడ్ బై చెప్పేశానట, ఒక ధనవంతుడైన బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకున్నానట, అంతేకాకుండా నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను (Quadruplets) పెంచుతున్నానట! ఇంకా ఏమైనా యాడ్ చేయాలా? లేక ఈ రోజుకి ఈ కల్పిత కథల కోటా పూర్తయిందా?’ అంటూ ఎద్దేవా చేసింది.
Also Read : Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్దేవ్పై ఆదిత్య ధర్ ప్రశంసలు!
ఈ పోస్ట్ ద్వారా త్రిష రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఒకటి, ఆమె సినిమాలను వదిలేయడం లేదు. రెండు, ఆమె పెళ్లి.. పిల్లల గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే. తన వ్యక్తిగత జీవితంపై మీడియాలో వస్తున్న అతిశయోక్తులకు త్రిష ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’, సూర్య ‘కరుప్పు’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేవలం తన పని మీద దృష్టి పెట్టిన త్రిష, ఇలాంటి రూమర్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయితే హద్దులు దాటినప్పుడు మాత్రం ఇలాంటి ‘పంచ్’లు తప్పవని పరోక్షంగా హెచ్చరించింది. తన ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటూనే, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో అభిమానుల మనసు గెలుచుకుంది.
