Battery Theft: పోలీసులకే సవాల్.. ట్రాఫిక్ సిగ్నల్స్ కు అమర్చిన బ్యాటరీలే టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Battery Theft: హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. అక్కడ ఇక్కడ కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ కు అమర్చిన బ్యాటరీలనే ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటివరకు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 74 బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. ఈ మధ్య కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయి. దీంతో అనుమానం వచ్చిన ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్లను పరిశీలించి.. బ్యాటరీలు చోరీకి గురయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 12న అబిడ్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బ్యాటరీలు చోరీకి గురైనట్లు గమనించారు. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.
Read Also: MLA MahipalReddy : అర్థంపర్థంలేని ఆరోపణలు కాదు.. ప్రూఫ్లున్నాయా
Also Read
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంబజార్, బేగంపేట్, కాచిగూడ, లంగర్హౌస్, హబీబ్నగర్, గోపాలపురం, మలక్పేట్, షాహినాయిత్ గంజ్, సైఫాబాద్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్లు వరుసగా పని చేయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు.. బ్యాటరీలు కనిపించ లేదు. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నెల 12న ఆబిడ్స్ సర్కిల్లోని ప్రధాన కూడలి వద్ద సిగ్నల్స్ పని చేయడం ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు పరిశీలించి ఆబిడ్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు రాజేంద్రనగర్లోని శాస్త్రీపురంకు చెందిన జంగాల మద్దిలేటి బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. జంగాల మద్దిలేటితో పాటు అతని స్నేహితుడుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన మద్దిలేటి కొన్ని నెలలుగా ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. విచారణలో 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 74 బ్యాటరీలను దొంగిలించినట్లు తేలింది. వీరి వద్ద రూ. 5 లక్షల విలువైన 26 పెద్ద బ్యాటరీలను, 48 చిన్న బ్యాటరీలను రికవరీ చేశారు.
తాజావార్తలు
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!