అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ అంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేపు మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 8గంటల వరకు వాహనాల దారి మళ్లింపు ఉంటుందని, నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నెక్లెస్ రోడ్డు – ఎన్టీఆర్ మార్గ్ – తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు ప్రవేశం ఉండదని, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు చేయనున్నట్ల తెలిపారు.
Also Read : AP CMO: మాటలు జాగ్రత్త.. మంత్రి సీదిరి అప్పలరాజుకు ఏపీ సీఎంఓ వార్నింగ్
సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు.. లకిడీకపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు.. ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లకిడీకపూల్ వైపు మళ్లింపు.. మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత.. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత.. ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం.. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియాను అనుసరించాలని సూచించిన పోలీసులు.. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని వెల్లడించారు.
Also Read : PAN Aadhaar link : గుడ్ న్యూస్.. ఈ వ్యక్తులకు పాన్ ఆధార్ లింక్ తప్పనిసరికాదు
