2026లో అప్పుడే అర్థ సంవత్సరం ముగిసిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జాతీయంగా అనేక విషాదకర ఘటనలు, గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అజిత్ పవార్ మరణం దగ్గర నుంచి ఎన్నో క్రైమ్ సీన్లు సంచలనం సృష్టించాయి.
అజిత్ పవార్ మరణం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి నియోజకవర్గానికి విమానంలో వెళ్తుండగా క్రాస్ ల్యాండింగ్ కారణంగా విమానంలో కూలిపోయింది. ఈ ఘటనలో అజిత్ పవార్తో పాటు విమానంలో ఉన్న వారంతా చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తమిళనాడు రాజకీయ మార్పు
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఆధ్వర్యంలో విజయ్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నో ఏళ్లుగా పాతికపోయిన పార్టీలను వెనక్కి నెట్టి అనూహ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ స్థాపించిన అతి కొద్ది కాలంలోనే విజయ్ ఘన విజయం సాధించడంతో జాతీయంగా సంచలనం సృష్టించారు.
డీకే.శివకుమార్
ఇక కర్ణాటకలో కూడా రాజకీయ మార్పు జరిగింది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య చాలా రోజులు కుర్చీ పంచాయితీ నడిచింది. ఎట్టకేలకు అధిష్టానం ఈ తగాదాకు ఫుల్ స్టాప్ పెట్టి డీకే.శివకుమార్ను ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్న డీకే.శివకుమార్ కల నెరవేరింది.
రాఘవ్ చద్దా
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్కు భారీ షాకిచ్చారు. రాఘవ్ చద్దాతో కలిసి నలుగురు ఆప్ ఎంపీలు బీజేపీ గూటికి చేరిపోయారు. దేశ వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టించింది. అనంతరం ఆప్ పార్టీపై రాఘవ్ చద్దా తీవ్ర విమర్శలు చేశారు. అంతకముందు రాజ్యసభలో రాఘవ్ చద్దాను కీలక పదవి నుంచి తప్పించింది.
ట్విషా శర్మ
తెలుగు నటి ట్విషా శర్మ ఇండోర్లో అత్త గారింట్లో శవమై కనిపించింది. వరకట్న వేధింపులతో భర్త, అత్త చంపేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటన కూడా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు సార్లు పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారు.
కేతన్ అగర్వాల్
కేతన్ అగర్వాల్.. పూణె యువ వ్యాపార వేత్త. సియా గోయల్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే సియా గోయల్కు ప్రియుడు ఉండడంతో కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ల మాట కాదనలేకపోయింది. జూన్ 18న ప్రియుడి చేతన్ సాయంతో సియా.. కేతన్ లోయలోకి తోసేసింది. దీంతో కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

