*నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు, ఇతర అధికారులతో కేంద్ర జల సమావేశాన్ని కేంద్ర జల శక్తి శాఖ చేపట్టనుంది. ఈ నెల 6న వర్చువల్గా అధికారులు భేటీ కానున్నారు. కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఇవాళ వీడియో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వర్చువల్గా ఏపీ సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ హాజరుకాలేదు. ఇవాళ హాజరు కాలేనని, ఈ నెల 5న సమావేశం నిర్వహించాలని తెలంగాణ సీఎస్ కోరారు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర జల శక్తి శాఖ సమావేశం చేపట్టనుంది. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని కేంద్ర కార్యదర్శి ముఖర్జీ సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈ నెల 4న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీకి కేంద్ర కార్యదర్శి సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను ఏపీ సీఎస్ వివరించారు.
*తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో అగ్రనేత రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 కి జూమ్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలవడనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది. మరోవైపు.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై కూడా రాహుల్ చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయంత్రం హైదరాబాద్ కి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి జార్జ్ వస్తున్నారు.
*కొత్తగా మద్యం దుకాణాలు.. గ్రేటర్ లో 615 షాపులకు అనుమతులు
కొత్తగా 615 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ అనుమతి ఇచ్చింది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో అనుమతులు పొందిన కొత్త మద్యం దుకాణాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. గత ఆగస్టులో 615 వైన్ షాపులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నోటిఫికేషన్ వెలువడడంతో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. గ్రేటర్ లో చాలా చోట్ల పెద్ద ఎత్తున పోటీ చేశారు. ప్రభుత్వం ఒక్కో మద్యం దుకాణానికి రూ.2 లక్షలు. వ్యాపారి ఎన్ని షాపులకైనా టెండర్ వేయవచ్చని ప్రభుత్వం చెప్పడంతో ఒక్కో వ్యాపారి నుంచి ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 100 వైన్ షాపులకు మాత్రమే 9 వేల మంది పోటీపడ్డారు. ఇక్కడ సరూర్ నగర్ లో 135 9 వేల మంది వైన్ షాపులకు టెండర్ వేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 615 దుకాణాలపై ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో రూ.650 కోట్లు వచ్చినట్లు అంచనా. అయితే శివారులోని ఉప్పల్, మేడిపల్లి, సేరిలింగంపల్లి, కుషాయిగూడ, కీసర, శంషాబాద్లోని వైన్ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు భారీగా డిమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 16న నోటిఫికేషన్ విడుదల చేసి అదే నెలాఖరున డ్రాలు నిర్వహించారు. సాధారణంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు రెండేళ్లకు ఒకసారి లైసెన్సులు ఇస్తుంది. ఒకసారి లైసెన్స్ పొందిన వ్యాపారి రెండేళ్లపాటు దుకాణాన్ని నడపవచ్చు. ప్రతి రెండేళ్లకోసారి అక్టోబర్ నెలాఖరున నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో అనుమతులు ఇస్తారు. అదే నెలలో మొత్తం ఫీజులో నాలుగో వంతు చెల్లించిన వారికి డిసెంబర్ 1న మద్యం షాపులకు చేరుతుంది. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆగస్టు నెలలోనే అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు. కొత్త మద్యం దుకాణాలకు లాట్ తీసి అనుమతి పొందిన వారు సెప్టెంబర్లోనే ప్రభుత్వానికి నాలుగో వంతు ఫీజు చెల్లించి…. మద్యం అమ్మకాలను అడ్డుకున్నారు. ఉదయం నుంచి మద్యం సరఫరా కావడంతో కొన్ని చోట్ల సాయంత్రం వరకు కొత్త దుకాణాలు తెరిచారు.
*ఎగ్జిట్ పోల్ కంటే ముందే నేను చెప్పా.. వచ్చేది కాంగ్రెస్: బండ్ల గణేష్
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ కంటే ముందే తాను చెప్పానని.. వచ్చేది కాంగ్రెస్ అని తెలిపారు. దారిన పోయే వాళ్లలో అందరిని అడగండి.. ఎవరు సీఎం అని అంటే వాళ్ళను సీఎం చేయండని అన్నారు. డిసెంబర్ 3 నుండి పండగ ప్రారంభమవుతుందని బండ్ల గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో.. 76 నుండి 86 వరకు సీట్లు వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ కంటే ఒకటి ఎక్కువ రావాలని అనుకున్నామని బండ్ల గణేష్ చెప్పారు. రాకెట్ సైన్స్ ఏం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి అని తన మనసులో మాట చెప్పారు. రాష్ట్రంలో రేవంత్ ప్రాణం పెట్టి కొట్లాడారని తెలిపారు. డిసెంబర్ 7 సాయంత్రం ఎల్బీ స్టేడియంలో పడుకుంటానని.. మీడియా వచ్చి ఇంటర్వ్యూ చేయాలన్నారు. దుప్పటి కూడా రెడీ చేసుకున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న చప్పట్లు కొడుతూ ఉంటా.. రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడం ఖాయమని బండ్ల గణేష్ చెప్పారు. అంతేకాకుండా.. మా ఎమ్మెల్యేలు కాలు జారరు.. చేజారరని తెలిపారు. ఇదిలా ఉంటే.. బండ్ల గణేష్ శనివారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
*ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం
సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.. 2019లో పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను ఆహ్వానిస్తే ఈ ఎన్నికల్లో జనసేన ఇండిపెండెంట్ గా పోటీ చేసేది.. 2004, 2005 నుంచి నేను దళిత, బీసీ కులాల నాయకులతో తిరిగే వాడిని.. అధికారం చూడని కులాలకి నిజమైన సాధికారత ఇవ్వాలని ఆలోచించాను అని తెలిపారు. బీసీ నేతలను మంత్రిని చేసి నిర్ణయాత్మక శక్తి లేకుండా చేయడం సాధికారత కాదన్నారు పవన్ కల్యాణ్.. వెనుకబడిన కులాలు ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. ఒంటరితనం అనుభవించి, అవమానాలు పడ్డాను.. ప్రతికూల పరిస్ధితుల్లో పార్టీ పెట్టాను అని గుర్తు చేసుకున్నారు. ఒక కులాన్ని ఆధారం చేసుకుని పాలిటిక్స్ చేయలేం.. మూడో ఎన్నికకు వచ్చేసరికి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ మారిపోయిందని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మన కులాన్ని మనం సంరక్షించుకుంటూనే.. మన పక్కన ఉన్న కులాలను కలుపుకు వెళ్ళాలి.. అని గద్దర్ చెప్పారు.. గొడవలకు కులాలను వాడతారు.. కానీ, ఎన్నికల్లో అది కనిపించదు అన్నారు. సామాజిక తెలంగాణ అని 2009లోనే చూపించేవాళ్లం.. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నేను ఎవరికి కొమ్ము కాయను… నాయకులు ప్రతీరోజూ కొట్టుకుంటే.. కార్యకర్తలు తలలు పగులకొట్టుకుంటారు. ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్ను దాటి కార్యకర్తల్లో ఒకరు జనసేనను నడపాలన్నారు. దేవాలయాలకి డబ్బులు పంపమని తల్లి చెపితే.. జనసేనకు డబ్బులు పంపుతున్నాడు ఒకాయన.. నేను వ్యక్తులను ఎన్నుకునేప్పుడు కులాలను చూడను గుణగణాలు చూస్తా అన్నారు పవన్.. ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొంటూ అవినీతి గురించి మాట్లాడకూడదు.. రాజశేఖరరెడ్డి హయాంలోనే కోట్లు సంపాదన ఉన్నవాడిని నేను అని గుర్తు చేసుకున్నారు. నేను ఈగోలకు వెళ్లను, ఛాన్సులు తీసుకోదలచుకోలేదు.. ఏపీ ప్రజలు గెలవాలనుకుంటున్నాను.. విభజన సమయంలో పార్టీ నిలబడెట్టుకోలేకపోయాం.. పొలిటికల్ అలజడి అతలాకుతలం చేసిందన్నారు. తెలివి లేక, వ్యూహం వేయలేక పార్టీ నిలబెట్టుకోలేకపోయా.. పుస్తకం పట్టుకోలేని వాడు, నా దృష్టిలో పడాలని చూసిన వాడు ఎమ్మెల్యే అయ్యాడు.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నిలబెట్టుకో లేకపోయాం అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి జనసేన విస్తృత భావజాలం నచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
*వైసీపీకి షాక్..! పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన కీలక నేతలు
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.. ఈ మధ్య కొందరు జనసేన పార్టీకి చెందిన నేతలు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే పనికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోంది.. ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.. ఇక, ఆ రోజు జనసేన పార్టీలో చేరిన నేతల విషయానికి వస్తే.. చిలకలపూడి పాపారావు సర్పంచ్, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కృష్ణాజిల్లా వైసీపీ నేత.. చిక్కాల దొరబాబు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, దుగ్గన నాగరాజు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, కలగ పాల్ పురుషోత్తం – తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, ఎదురువాక వెంకటగిరి- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, పొగిరి సురేష్ బాబు – శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు, వై శ్రీనివాస్ రాజు – కడప జిల్లా వైసీపీ నాయకులతో పాటు.. మరికొందరు నేతలు కూడా ఉన్నట్టుగా జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు.
*అయోధ్య రామమందిర శంకుస్థాపన.. 6000 మంది అతిథులకు ఆహ్వానం
అయోధ్య రామమందిర శంకస్థాపన కోసం వడివడిగా పనులు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న రామమందిర ప్రతిష్టాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేతులు మీదుగా శ్రీరామ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది. ఇప్పటికే అయోధ్య ఆలయ ట్రస్ట్ ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక అందించింది. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న శ్రీరామ ఆలయ శంకుస్థాపన కోసం దేశవ్యాప్తంగా 6000 మంది అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పూజారులు, సాధువులే కాకుండా, ప్రధాని మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్తో సహా రాజకీయ ప్రముఖులు జనవరి 22న ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలతో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణాలను నిర్వహిస్తుందని ఒక అధికారి తెలిపారు. జనవరి 14 నుంచి 22 వరకు పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆలయ నిర్మాణం కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్’ని ఏర్పాటు చేసింది. 2020 ఆగస్టు 5న మోదీ ఆలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణం ప్రారంభమైంది. 1988లో అహ్మదాబాద్ లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ పై ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
*భారత్లో కొత్తగా 88 కరోనా కేసులు..
2020ని ప్రపంచం ఎప్పటికీ మరవదు. అనూహ్యంగా మనమధ్యకు వచ్చిన ఈ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ వైరస్ పుట్టుక, మనుగడ తెలుసుకునేలోపే లక్షల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వ్యాక్సినేషన్లు రావడంతో కరోనా నుంచి ఉపశమనం లభించింది. క్రమంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా మాత్రం పోలేదు. ఇంకా మహమ్మారి మన మధ్యే ఉంది. రీసెంట్గా మరోసారి ఈ మహమ్మారి మరోసారి బయటకు వచ్చింది. యూకేలో మార్పు పొంది కొత్త వెరియంట్తో విజఈంభించేసుందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్తో కొత్తగా 88 కరోనా కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు సూమారు 400 మంది ఈ వైరస్కు చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్య శాఖ తన వెబ్సైట్లో కరోనా కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలో ఈ మహమ్మారి కారణంగా 5,33,300మంది ప్రాణాలు కోల్పోగా.. కరోనా సోకిన వారి సంఖ్య 4,50,02,103గా ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 98.81 కాగా, మరణాల రేటు 1.19 శాతం ఉన్నట్టు చెప్పింది. అలాగే ఇప్పటివరకు దేశంలో 220.67 కోట్లకు పైగా జనాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందించినట్టు తెలిపింది. అయితే ఇటీవల కరోనా పాజిటివ్లో సిమ్లా ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ మహిళ మృత్యువాత పడ్డట్లు పేర్కొంది.
*బంగ్లాదేశ్ లో భారీ భూకంపం.. పశ్చిమబెంగాల్లోనూ ప్రకంపనలు
బంగ్లాదేశ్లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. చిట్టగాంగ్లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కోల్ కతా సహా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రాష్ట్రంలో ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. , ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు’ అని అధికారులు తెలిపారు. కోల్ కతా పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా, శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్లోని రామ్గంజ్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చినట్లు వెల్లడించారు. భూకంప కేంద్రం రామ్గంజ్ సమీపంలో ఉందని పేర్కొంది. నిమిషాల వ్యవధిలోనే చిట్టగాంగ్ ప్రావిన్స్లోని లక్ష్మీపూర్, చాంద్పూర్, కొమిల్లాలో భూమి కంపించింది. అదేవిధంగా, రాజ్షాహి, సిల్హెట్, ఢాకా, నౌఖాలీ మరియు కుస్తియాలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
*భారత సంతతి వ్యక్తి హత్యకు ఖలిస్తాన్ తీవ్రవాదుల కుట్ర.. ముగ్గురికి శిక్ష విధింపు..
ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాటువాద నేతలు యాక్టీవ్ అవుతున్నారు. ముఖ్యంగా కెనడా, యూఎస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వారి కార్యకలాపాలు పెరిగాయి. భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఇదే కాకుండా ఖలిస్తానీ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని హతమర్చాడానికి ప్రయత్నించడంతో పాటు భయాందోళనకు గురిచేస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత అక్కడ హిందువులను టార్గెట్ చేసుకుంటూ గురుపత్వంత్ సింగ్ పన్నూ అనే ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే ఖలిస్తాన్ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కోపంతో న్యూజిలాండ్ ఆక్లాండ్లో రేడియో హోస్ట్ హర్నెక్ సింగ్పై ముగ్గురు ఖలిస్తాన్ తీవ్రవాదులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురికి శిక్ష పడింది. 27 ఏళ్ల సర్వజీత్ సిద్దూ హత్యాయత్నానికి పాల్పడ్డాడని, 44 ఏళ్ల సుఖ్ప్రీత్ సింగ్ దీనికి సహకరించాడని, మూడో వ్యక్తి అక్లాండ్ నివాసి అని ది ఆస్ట్రేలియన్ టుడే నివేదించింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి మార్క్ వూల్ఫోర్డ్ సమాజ రక్షణ, మతపరమైన మతోన్మాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు. డిసెంబర్ 23,2020న హర్నెక్ సింగ్ను అతని ఇంటిబయట ఖలిస్తానీ తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 40 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచారు. ఈ ఘటనలో 350 కంటే ఎక్కువ కట్లు పడటంతో పాటు అతనికి అనేక సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హర్నెక్ సింగ్ని హత్య చేయడానికి ఖలిస్తానీ భావజాలం ఉన్న వ్యక్తులు మూడు కార్ల నిండా వ్యక్తులు అతడిని అనుసరించారు. ప్రమాదాన్ని గమనించి కార్ డోర్లు మూసేసి, గట్టిగా కార్ హారన్ కొట్టడంతో ఇరుగుపొరుగు వారు ఈ దాడిని చూడగలిగారు. ప్రముఖ కివీస్ రేడియో హోస్ట్గా ఉన్న హార్నెక్ సింగ్ ఖలిస్తాన్కి వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల్లో్ 48 ప్రధాన సూత్రధారికి 13.5 ఏళ్ల శిక్ష విధించబడింది. సర్వజీత్ సిద్దూకి 9.5 ఏళ్లు జైలు శిక్ష, సుఖ్ప్రీత్ సింగ్కి 6 నెలల గృహ నిర్భందం విధించబడింది. మరో ఇద్దరు వ్యక్తులు జగరాజ్ సింగ్, గుర్బిందర్ సింగ్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదలయ్యారు. మరో ఇద్దరు జోబన్ ప్రీత్ సింగ్, హర్దీప్ సింగ్కి ఈ హత్యయత్నంలో ప్రమేయం ఉండటంతో వచ్చే ఏడాది ప్రారంభంలో శిక్ష విధించబడనుంది.