NTV Telugu Site icon

Pawan Kalyan : నేడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్‌ నిర్మాతలు

Pawan

Pawan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్‌ స్పీడ్‌ పెంచారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన ప్రతిరోజూ వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన దర్బార్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సహాయాన్ని కోరేందుకు వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం విజయవాడలోని పవన్ క్యాంపు కార్యాలయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు పవన్ కల్యాణ్‌ని కలవనున్నారు. ఈ సమావేశంలో అశ్వినీదత్, చినబాబు, నవీన్ యెర్నేని, రవిశంకర్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోధర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొంటారు. 2024 ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించడం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాల కారణంగా ప్రస్తుతం టీఎఫ్‌ఐ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించడం రేపటి సమావేశం ఎజెండా. టికెట్‌ ధరల్లో వెసులుబాటు, థియేటర్లలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.