ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకు స్వస్తి పలికి మన స్టార్ హీరోలు పీరియాడిక్ మరియు హిస్టారికల్ డ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ మరియు చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుండటంతో మన హీరోలంతా ఇప్పుడు పాత కాలం నాటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
Also Read : Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ‘ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామాగా తెరకెక్కుతోంది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన రూట్ మార్చి ‘రణబాలి‘ అనే చారిత్రాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 19వ శతాబ్దపు నేపథ్యంలో ముఖ్యంగా 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనపై జరిగిన పోరాటాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా పూర్తిస్థాయిలో పీరియాడిక్ మరియు హిస్టారికల్ ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టారు. అందులో ఒకటి 7వ శతాబ్దానికి చెందిన యాక్షన్ డ్రామా ‘స్వయంభు‘. దీనితో పాటు స్వతంత్ర సంగ్రామ కాలం నాటి కథతో ‘ద ఇండియా హౌస్‘ అనే చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. యాక్షన్ హీరో గోపిచంద్ కూడా ఈ పీరియాడిక్ రేసులో చేరిపోయారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘భరతవర్ష‘ అనే భారీ ప్రాజెక్టును ఆయన పట్టాలెక్కించారు. ఇది కూడా 7వ శతాబ్దపు నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రాబోతోంది. ఇలా అగ్ర హీరోల నుండి యువ హీరోల వరకు అందరూ పీరియాడిక్ కథల వైపే మొగ్గు చూపుతుండటంతో రాబోయే కాలం టాలీవుడ్లో చరిత్రను తిరగరాసే చిత్రాలదే అని చెప్పవచ్చు.
