Today Stock Market Roundup 06-04-23: అనుపమ్ రసాయన్.. రికార్డ్ లెవల్ గ్రోత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 06-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. ఎర్లీ ట్రేడింగులో ఊగిసలాట ధోరణిలో జరిగిన ట్రేడింగ్ కారణంగా వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో పూడ్చుకోగలిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచకపోవటం కలిసొచ్చింది. జీడీపీ గ్రోత్ మరియు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలు ఈక్విటీ మార్కెట్ పెట్టుబడిదారుల సెంటిమెంటును బలపరిచాయి.
దీంతో రెండు కీలక సూచీలు కనీసం స్వల్ప లాభాలతోనైనా సరిపెట్టుకోగలిగాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు పెరిగి 59 వేల 832 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 42 పాయింట్లు పెరిగి 17 వేల 599 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ లోని మొత్తం 30 కంపెనీల్లో 17 కంపెనీలు లాభాల బాటలో నడవగా 13 కంపెనీలు నష్టాల బాట పట్టాయి.
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
read more: IMF bailout for Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కనున్న ద్వీపదేశం
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ రాణించాయి. ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, ఎన్టీపీసీ వెనకబడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో బజాజ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్ మంచి పనితీరు కనబరిచాయి. హెచ్ సీఎల్ టెక్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ ఒక శాతానికి పైగా పడిపోయాయి.
సెక్టార్ల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ బ్యాంక్, రియాల్టీ, PSU, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్ సెక్టార్లు ఒక శాతం వరకు పెరిగాయి. వ్యక్తిగత స్టాక్స్ పరిశీలిస్తే.. అనుపమ్ రసాయన్ సంస్థ షేర్ల విలువ రెండు నెలల్లో రికార్డు స్థాయిలో 58 శాతం వృద్ధి చెందింది. వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు సాధించటం ప్లస్ పాయింట్ అయింది. 10 గ్రాముల బంగారం రేటు 68 రూపాయలు తగ్గింది.
గరిష్టంగా 60 వేల 788 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 175 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 730 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు నామమాత్రంగా పాతిక రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 580 రూపాయలుగా నమోదైంది. రూపాయి విలువ 8 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 95 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!