Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today Business Headlines 10 04 23 Mukesh Ambani Reliance Entity To Enter Ice Cream Market Soon

Today Business Headlines 10-04-23: అంబానీ సామ్రాజ్యం నుంచి అతిత్వరలో హిమక్రిములు

Published Date :April 10, 2023 , 5:24 pm
By Akkirala Kondala Rao
Today Business Headlines 10-04-23: అంబానీ సామ్రాజ్యం నుంచి అతిత్వరలో హిమక్రిములు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today Business Headlines 10-04-23:

త్వరలో రిలయెన్స్ ఐస్‌క్రీం

ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ రిటైల్ సొంతగా ఐస్‌క్రీం బ్రాండ్‌ను లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీఅనుకున్నట్లు జరిగితే ఈ ఎండాకాలంలోనే రిలయెన్స్ బ్రాండ్ ఐస్‌క్రీం మార్కెట్లోకి రానుందని అంటున్నారు. రిలయెన్స్ ఇప్పటికే కూల్ డ్రింకులు, సోపులు మరియు గృహ సంరక్షణ ఉత్పత్తుల్లో సొంత బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐస్ క్రీం మార్కెట్ విలువ 20 వేల కోట్ల రూపాయలుగా ఉంది.

60 వేల కోట్లకు ‘అమూల్’

అమూల్ బ్రాండెడ్ కంపెనీ ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 66 వేల కోట్ల రూపాయలకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. డిమాండ్ పెరగటం వల్ల 20 శాతం గ్రోత్ నమోదు కానుందని భావిస్తున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ 18 పాయింట్ 5 శాతం వృద్ధి చెందింది. తద్వారా 55 వేల 55 కోట్ల రూపాయలకు చేరుకుంది. కరోనా తర్వాత బ్రాండెడ్ డెయిరీ ప్రొడక్టులకు గిరాకీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాల రేటు పెంచే ప్రణాళికలేమీ లేవని అమూల్ ఎండీ జయేన్ మెహతా పేర్కొన్నారు.

కొనసాగిన ఎఫ్‌పీఐల సేల్స్

కిందటి ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్‌స్టిట్యూషన్స్ సేల్స్ ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఒకటీ పాయింట్ 4 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా గత సంవత్సరం 37 వేల 631 కోట్ల విలువైన షేర్లను మాత్రమే అమ్మాయి. ఎఫ్‌పీఐలు వరుసగా రెండేళ్ల పాటు అమ్మకాలకు దిగటం ఇదే తొలిసారి. అగ్రరాజ్యం అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం దీనికి ప్రధాన కారణం.

తగ్గిన బంగారం దిగుమతి

మన దేశానికి పసిడి దిగుమతులు పడిపోతున్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఇండియా దాదాపు 2 పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల విలువైన 6 వందల టన్నుల బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 30 శాతం తక్కువ. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. దిగుమతి సుంకాలు అధికంగా ఉండటం మరియు అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనటం పుత్తడి దిగుమతులను దెబ్బతీశాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అందువల్లే గత ఆగస్టు నెల నుంచి ఇంపోర్టులు నేల చూపులు చూశాయి.

కొత్త ఇన్వెస్టర్లు 2.5 కోట్లు

2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి కొత్త పెట్టుబడిదారులు భారీ సంఖ్యలోనే చేరారు. రెండున్నర కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. అంటే.. నెలకి యావరేజ్‌గా 20 లక్షల ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 11 పాయింట్ నాలుగు ఐదు కోట్లకు చేరింది. అంతకుముందు ఈ అకౌంట్ల సంఖ్య 8 పాయింట్ తొమ్మిదీ ఏడు కోట్లు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. దీన్నిబట్టి చూస్తే 27 శాతం గ్రోత్ నమోదైందని చెప్పొచ్చు.

‘వైజాగ్’ కోసం తెలంగాణ బిడ్

విశాఖ ఉక్కును సొంతం చేసుకోవటంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రస్ట్‌గా ఉంది. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించింది. సింగరేణి ద్వారా బిడ్ వేయటానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో సింగరేణి సంస్థ అధికారులు ఇవాళో రేపో విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టబోతోంది. విశాఖ స్టీల్‌ని ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకోనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amul brand turnover
  • fpi sales
  • gold import
  • new dmat accounts
  • reliance icecream

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions