Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today 17 02 23 Business Headlines Indian Railways India Post Launch Express Cargo Service

Today (17-02-23) Business Headlines: రైల్ పోస్ట్ కార్గో సర్వీస్ ప్రారంభం. మరిన్ని వార్తలు

Published Date :February 17, 2023 , 11:02 am
By Akkirala Kondala Rao
Today (17-02-23) Business Headlines: రైల్ పోస్ట్ కార్గో సర్వీస్ ప్రారంభం. మరిన్ని వార్తలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (17-02-23) Business Headlines:

హైదరాబాదులో బయోఏషియా సదస్సు

Also Read

  • Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
  • Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
  • E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
  • IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బయోఏషియా సదస్సు జరగనుంది. HICC నొవాటెల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్టార్టప్‌ స్టేజ్‌ పెవిలియన్‌.. సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవనుంది. హెల్త్‌ మరియు బయాలజీ సెగ్మెంట్‌లో స్టార్టప్‌లను ఎంకరేజ్‌ చేయాలనే టార్గెట్‌తో ఈ పెవిలియన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగపూర్‌, థాయ్‌లాండ్‌, అమెరికా, ఐర్లాండ్‌, బ్రిటన్‌ తదితర దేశాలకు చెందిన 400 స్టార్టప్‌లు అప్లై చేయగా 75 స్టార్టప్‌లను మాత్రమే సెలెక్ట్‌ చేశారు. ఆయా సంస్థలే తమ ప్రొడక్టులను, సర్వీసులను ఈ పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచుతాయి.

యూట్యూబ్ సీఈఓగా నీల్ మోహన్

యూట్యూబ్‌ చీఫ్‌ ఎగ్జ్‌గ్యూటివ్‌ ఆఫీసర్‌గా ఫేమస్‌ ఇండియన్‌ అమెరికన్‌ నీల్‌ మోహన్‌ నియమితులయ్యారు. గడచిన తొమ్మిదేళ్లుగా ఈ పదవిలో ఉన్న సూసన్‌ వోజ్‌సికి వైదొలగనుండటంతో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. సూసన్‌ వోజ్‌సికి.. హెల్త్‌, ఫ్యామిలీ, పర్సనల్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టేందుకు తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న నీల్‌ మోహన్‌ ప్రమోషన్‌ పొందుతున్నారు. యూట్యూబ్‌ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ అనే సంగతి తెలిసిందే. దీనికి భారతీయ మూలాలున్న వ్యక్తి సారథ్యం వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

విదేశీ విరాళాలపై పెరగనున్న నిఘా

విదేశాల నుంచి ఇండియాకి అందుతున్న విరాళాలపై ఇక మరింత నిఘా పెరగనుంది. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏరోజుకారోజు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం.. విదేశీ విరాళాల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. డైలీ.. కేంద్ర హోం శాఖకు సమర్పించాలి. ఈ మేరకు ఎస్‌బీఐ.. నెఫ్ట్‌ మరియు ఆర్‌టీజీఎస్‌ వ్యవస్థల్లో మార్పులు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది.

విశాఖ కంటే గంగవరం పోర్ట్ బెటర్

తన ఎల్‌పీజీ దిగుమతులను అదానీ సంస్థకు అప్పగించటం పట్ల వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ రంగ సంస్థ వివరణ ఇచ్చింది. విశాఖ రేవుకు బదులుగా అదానీ గ్రూపు నిర్వహణలోని గంగవరం పోర్టును ఎందుకు సెలక్ట్‌ చేసుకోవాల్సి వచ్చిందో వివరించింది. విశాఖ రేవు కంటే గంగవరం బెటర్‌ అని అభిప్రాయపడింది. గంగవరం పోర్టుకు పెద్ద ట్యాంకర్లు వచ్చే వీలుందని, అంతేకాకుండా.. అక్కడ మెరుగైన సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొంది. విశాఖ పోర్టుతో పోల్చితే గంగవరంలో ఎల్‌పీజీ దిగుమతికి సమయం కలిసొస్తుందని, దీనివల్ల డెమరేజ్‌ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరంలేదని వెల్లడించింది.

రైల్ పోస్ట్ కార్గో సర్వీస్ ప్రారంభం

ఇండియన్‌ రైల్వేస్‌ మరియు ఇండియా పోస్ట్‌.. జాయింట్‌ పార్సిల్‌ సర్వీసును గురువారం ప్రారంభించాయి. రైల్‌ పోస్ట్‌ గతిశక్తి ఎక్స్‌ప్రెస్‌ కార్గో సర్వీస్‌ పేరిట అధికారికంగా ఆరంభించాయి. గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా పార్సిళ్లను నేరుగా మరియు నిరాటంకంగా రవాణా చేసేందుకు ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసు ప్రస్తుతం నాలుగు సెక్టార్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో.. హైదరాబాద్‌ టు హజ్రత్‌ నిజాముద్దీన్‌ రూట్‌ కూడా ఉండటం గమనించాల్సిన అంశం.

వసంత్ ప్రభు త్వరలో రిటైర్‌మెంట్

పేమెంట్ల రంగంలో దిగ్గజ సంస్థ అయిన వీసా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వసంత్‌ ప్రభు రిటైర్‌ అవుతున్నారు. 63 ఏళ్ల వసంత్‌ ప్రభు ఈ కంపెనీ ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఎండింగ్‌లో.. అంటే.. సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. 2015 నుంచి ఈయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. సంస్థను భారీ లాభాల్లోకి తీసుకెళ్లారు. వీసా నెట్‌వర్క్‌లో పేమెంట్ల సంఖ్యను రెట్టింపు చేశారు. ఈ విషయంలో తనకు ఎంతో సంతృప్తిగా, గర్వంగా ఉందని చెప్పారు. తన రిటైర్‌మెంట్‌ అనంతరం కూడా వీసా సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వసంత్‌ ప్రభు.. వీసా వైస్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bioasia conclave
  • Express Cargo Service
  • Gangavaram port
  • India Post
  • Indian Railways

తాజావార్తలు

  • SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..

  • Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?

  • Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..

  • Sai Sudharsan: సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్.. ఐపీఎల్ హిస్టరీలో నయా రికార్డ్.. క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్

  • Soya Chunks: హై ప్రోటీన్.. అదిరిపోయే టేస్ట్! 10 నిమిషాల్లో సింపుల్‌గా కర్రీని ఇలా వండేయండి..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions