Today (16-01-23) Stock Market Roundup: గుడ్ మార్నింగ్.. బ్యాడ్ ఈవెనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (16-01-23) Stock Market Roundup: డిసెంబర్ నెలలో టోకు ధరలు తగ్గినప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం నమ్మకం పెరగలేదు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ బిజినెస్ కొత్త సంవత్సరంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించట్లేదు. మొదటి రెండు వారాలూ ఫ్లాట్గానే కొనసాగిన రెండు సూచీలు మూడో వారంలోనూ అదే ధోరణిలో వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇంట్రాడేలో నేల చూపులు చూసి చివరికి నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్ తన బెంచ్ మార్క్ అయిన 60 వేల పాయింట్లను దాటగలిగింది గానీ నిఫ్టీ మాత్రం బెంచ్ మార్క్ 18 వేల పాయింట్లకు దిగువనే ఉండిపోయింది. గత వారం పది రోజులుగా స్టాక్ మార్కెట్కి మార్నింగ్ గుడ్, ఈవెనింగ్ బ్యాడ్ పరిస్థితులు నెలకొంటున్నాయి. అంటే.. ట్రేడింగ్ శుభారంభం అవుతున్నా ముగింపు ఆ స్థాయిలో ఉండట్లేదు. మొత్తానికి సెన్సెక్స్ 168 పాయింట్లు కోల్పోయి 60 వేల 92 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
Exclusive Story on Ambani Companies: అంబరాన్ని తాకుతున్న.. ‘అంబానీ’ వ్యాపార సామ్రాజ్యం..
నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 17 వేల 894 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని మొత్తం 30 స్టాక్స్లో 15 స్టాక్స్ లాభాల బాటలో, మిగతా 15 స్టాక్స్ నష్టాల బాటలో నడిచాయి. టెక్ మహింద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ భారీగా ప్రాఫిట్స్ నమోదు చేశాయి. ఈ సంస్థల షేర్ల ధరలు 3 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీలో ఐటీ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచీలు బెస్ట్ పెర్ఫార్మర్స్గా నిలిచాయి. వ్యక్తిగత స్టాక్స్ వారీగా పరిశీలిస్తే సులా వైన్యార్డ్ షేర్లు 15 శాతం పెరిగాయి.
తాజా త్రైమాసికంలో అత్యధిక సేల్స్ జరగటం ఈ సంస్థకు కలిసొచ్చింది. 10 గ్రాముల బంగారం రేటు 159 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 483 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 243 రూపాయలు లాభపడి అత్యధికంగా 69 వేల 670 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 19 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 61 పైసల వద్ద స్థిరపడింది. క్రూడాయిల్ 34 రూపాయలు పెరిగి 6 వేల 496 రూపాయలుగా నమోదైంది.
తాజావార్తలు
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!