NTV Telugu Site icon

Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!

Ttd

Ttd

తిరుపతి బాలాజీ ప్రసాదంపై వివాదాల నేపథ్యంలో సంత్ సమాజ్ తీవ్రంగా మండిపడింది. ఇదిలా ఉండగా.. ధార్మిక నగరమైన కాశీలో తిరుపతికి వెళ్లే భక్తులు ఇప్పుడు శుద్ధి చేసి ఈ పాపాన్ని కడిగేస్తుకుంటున్నారు. దేవాలయాలలో, ఘాట్‌ల ఒడ్డున పంచగవ్య ద్వారా ప్రజలు తమ శరీరాన్ని, మనస్సును క్రమం తప్పకుండా శుద్ధి చేసుకుంటున్నారు. సోమవారం, పాండే ఘాట్ వద్ద ఉన్న ఆలయంలో ఒక కుటుంబం ఈ ప్రక్రియను స్వీకరించింది.

READ MORE: Nebula-1 Rocket: చైనా ఆశలు అడియాశలు..! ల్యాండింగ్ సమయంలో రాకెట్ పేలి భారీ నష్టం

వారణాసికి చెందిన తులసి సంజయ్ జోషి మాట్లాడుతూ.. తన కుటుంబం ప్రతి సంవత్సరం తిరుపతి బాలాజీ దర్శనానికి వెళ్తుందని, అక్కడి నుంచి ఇంటికి లడ్డూ ప్రసాదాన్ని తీసుకువస్తారని చెప్పారు. అయితే లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి భక్తులందరూ ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అటువంటి పరిస్థితిలో ఈ పాపాన్ని అధిగమించడానికి నేడు కుటుంబ సమేతంగా సనాతన ధర్మంలో శుద్ధీకరణ ప్రక్రియ ప్రకారం శుద్ధి పొందుతున్నట్లు తెలిపారు.

READ MORE:Speaker Ayyanna Patrudu: విశాఖ డెయిరీపై స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు

సనాతన ధర్మంలో పంచగవ్యను శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. దీని కింద ఆవు మూత్రం, ఆవు పేడ, పాలు, పెరుగు, నెయ్యి ఉపయోగించి పంచగవ్యను తయారు చేస్తారు. వేద మంత్రాలను పఠిస్తూ దానితో శరీరాన్ని శుద్ధి చేస్తారు. తిరుపతి బాలాజీ ప్రసాదాన్ని భుజించిన వారు ఇప్పుడు పంచగవ్య ద్వారా సనాతన పద్ధతిలో శుద్ధి పొందుతున్నారని కాశీ పండితులు తుస్లీ కమలాకాంత్ తెలిపారు. పంచగవ్య ద్వారా శుద్ధి చేసే సంప్రదాయం గ్రంథాలలో ఉందని పేర్కొన్నారు.