NTV Telugu Site icon

Tirumala Laddu: తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందించిన సద్గురు!

Sadguru

Sadguru

Tirumala Laddu: లడ్డూ ప్రసాదం అంశంపై కోయంబత్తూర్‌కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధినేత సద్గురు తన స్పందనను వ్యక్తం చేశారు. ఆలయ ప్రసాదంలో ఆవు కొవ్వును భక్తులు వినియోగించడం అత్యంత అసహ్యకరమని అన్నారు. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలని సద్గురు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదంగా అందించే లడ్డూలలో నెయ్యి కల్తీ అని ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లడ్డులో జంతు కొవ్వు, చేప నూనె కూడా కలిపినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి అంటూ అయన తెలిపారు.

Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..

అయితే, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును ఉపయోగించడంపై భారీ వివాదం తర్వాత, ఆలయ నిర్వాహకులు ఈ పవిత్ర ప్రసాదం పవిత్రతను పునరుద్ధరించారు. ఈ విషయమై శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) గత శుక్రవారం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లో శ్రీవారి లడ్డూల పవిత్రత ఇప్పుడు మచ్చలేనిదని పేర్కొంది. భక్తులందరి సంతృప్తి కోసం లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని తెలిపింది.

Good Cholesterol vs Bad Cholesterol: మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మధ్య తేడా తెలుసా..?

ఈ విషయంలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తన స్పందనను తెలియజేస్తూ.., భక్తి లేని చోట స్వచ్ఛత ఉండదని ఆయన అన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ పాలనతో కాకుండా భక్తులైన హిందువులే నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 3 లక్షల లడ్డూలు తయారవుతాయి. లడ్డూను శనగపిండి, నెయ్యి, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకుల నుండి తయారు చేస్తారు. దీని రెసిపీ సుమారు 300 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆలయ నిర్వాహకులు ఈ ప్రసాదం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ. 500 కోట్లు ఆదాయం చేకూరుతుంది.