‘డీజే టిల్లు”. ఈ సినిమా గత సంవత్సరం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో టిల్లు క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది..ఈ సినిమాకు కథను సిద్దూ జొన్నలగడ్డ అందించాడు.డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా విడుదల అయినప్పుడే సీక్వెల్ అనౌన్స్ చేయగా ఈ సంవత్సరం సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే ఈసారి ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు ‘టిల్లు సీక్వెల్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.
ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.డిజే టిల్లు సినిమాలో రాధికా క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రలో నటించిన నేహా శెట్టి కూడా బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస ఆఫర్స్ కూడా వచ్చాయి. మరి టిల్లు స్క్వేర్ లో అనుపమ పాత్ర ఎలా ఉంటుందో అని ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మరి తాజాగా ఈ సినిమా విడుదల గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను ముందుగా సెప్టెంబర్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.. కానీ ఇప్పుడు మేకర్స్ వారి డెసిషన్ మార్చుకున్నట్లు సమాచారం.సెప్టెంబర్ 15న విడుదల చేయకుండా మరో కొత్త తేదిని పరిశీలిస్తున్నట్టు సమాచారం..ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఎందుకంటే సెప్టెంబర్ లో సలార్ వంటి భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ పోటీలో విడుదల చేయడం కంటే విడుదల తేదిని వాయిదా వేయడం మంచిది అని మేకర్స్ భావిస్తున్నారు.